You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా మళ్లీ ఆగిపోయింది
అమెరికాలో మరోసారి ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. నిర్ణీత గడువులోగా ద్రవ్య వినిమయ బిల్లు కాంగ్రెస్లో ఆమోదం పొందకపోవడంతో ఈ పరిస్థితులు తలెత్తాయి.
ఇలా ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోవడం మూడు వారాల్లో ఇది రెండోసారి.
రెండేళ్ల వరకు నిధుల వినియోగానికి ప్రభుత్వానికి వీలు కల్పించే ఈ బిల్లు గురువారం అర్ధరాత్రిలోగా ఉభయసభల్లో ఆమోదం పొందాల్సి ఉంది.
అయితే, ఖర్చులపై పరిమితి విధించేందుకు తాను ప్రవేశపెట్టిన సవరణపై చర్చించాలంటూ రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ పట్టుబట్టారు. దాంతో సెనేట్లో బిల్లుపై ఓటింగ్ ఆగిపోయింది.
సెనేట్ ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ బిల్లుపై హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్లో ఓటింగ్ జరిగే వీలుంటుంది.
శుక్రవారం ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఇలాంటి పరిస్థితే జనవరిలోనూ తలెత్తింది. అప్పుడు మూడు రోజుల పాటు ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఇవి కూడా చూడండి:
- అమెరికాలో నిలిచిపోయిన ట్రంప్ ప్రభుత్వ సేవలు
- ప్రపంచాన్ని ట్రంప్ మరింత ప్రమాదంలోకి నెట్టేశారా?
- 'నాకు ‘ఖత్నా’ చేశారు.. నా కూతురికి అలా జరగనివ్వను!'
- గూగుల్ రహస్యాలను ‘దొంగిలించిన’ ఉబర్.. కోర్టుకెక్కిన గొడవ
- బెంగళూరు సహా ఈ 11 నగరాల్లో నీటికి కటకటే!
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- (బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)