You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘సంప్రదాయ వైద్యంతో గర్భం’.. మోసపోయిన వందలాది మంది మహిళలు
గర్భం వచ్చేందుకు సహకరిస్తానని నమ్మించి, వందలాది మంది మహిళల్ని మోసం చేసిన సంప్రదాయ వైద్యురాలిని గినియా పోలీసులు అరెస్ట్ చేశారు.
‘న ఫన్ట కమర’ అనే సంప్రదాయ వైద్యురాలు.. మహిళలకు కొన్ని ఆకులు, మూలికలు, ఇతర మందుల్ని కలిపిన మిశ్రమాన్ని ఇచ్చింది.
గర్భం వచ్చేందుకు ఈ మిశ్రమం సహకరిస్తుందని కమర చెప్పడంతో.. ఆమె మాటలు నమ్మి వందలాది మంది మహిళలు దీనిని తీసుకున్నారు.
తన సేవలకు గాను కమర ఒక్కో మహిళ నుంచి 33 డాలర్లు (దాదాపు రూ.2100) వసూలు చేసింది. గినియా దేశంలో సగటు నెలసరి వేతనం 48 డాలర్లు (దాదాపు రూ. 3000) .
ఇలా అమాయకులైన మహిళల్ని నమ్మించి కమర నెలకు లక్షలాది రూపాయలు సంపాదించిందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మాత్రం మహిళలకు సహాయపడుతున్నానని చెబుతోంది.
గినియా రాజధాని నగరం కనర్కీ పోలీసులు మంగళవారం కమరను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్ ఎదుట దాదాపు 200 మంది మహిళలు నిరసన ప్రదర్శన జరిపారు.
కమర గర్భధారణ వైద్యంతో 17 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మహిళలు 700 మందిదాకా బాధితులయ్యారు.
గినియా సహా చాలా ఆఫ్రికా దేశాల్లో ఎంతో మంది ప్రజలు సంప్రదాయ వైద్యులపై ఆధారపడుతున్నారు.
80 శాతం మంది ఆఫ్రికన్లు సంప్రదాయ వైద్య సేవలను వినియోగిస్తున్నారని 2006లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
‘కృతజ్ఞతగా కోళ్లు, బట్టలు’
‘‘ఈ మహిళ (కమర)ను కలిసేందుకు మేం వెళ్లి ఇప్పటికి ఏడాది’’ అని నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఒక మహిళ బీబీసీ కనర్కీ ప్రతినిధి అల్హసన్ సిల్లహ్తో చెప్పారు.
‘‘మొదటిసారి మేం వెళ్లినప్పుడు ఆమె కొన్ని ఆకులు, మూలికల మందు ఇచ్చింది. దాంతో మాకు వాంతులయ్యాయి. ఇది మాకు చాలా మంచిదని ఆమె నమ్మబలికింది. అయితే, ఈ మందు వాడుతుంటే పొట్ట కొంచెం పెద్దది అవుతోంది.’’
‘‘కొంతకాలం తర్వాత మేం తిరిగి వెళ్లాం. ఆమె మా పొట్టను పట్టుకుని.. మేం గర్భవతులమయ్యామని ప్రకటించింది’’ అని ఆమె తెలిపారు.
ఒక్కసారి తాను పరీక్షించి, గర్భం వచ్చిందని చెప్పాక మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లొద్దని, తనకు కృతజ్ఞతగా కోడిని, బట్టల్ని ఇవ్వాలని కమర చెప్పినట్లు ఆమె వెల్లడించారు.
కొందరు మహిళలు 12 నుంచి 16 నెలల పాటు గర్భవతుల్లాగా కనిపించారు.
బాధితుల్లో 47 మందిని పోలీసు వైద్యులు పరీక్షించి.. ఈ వైద్యం వల్ల దీర్ఘకాలిక ఇబ్బందులు కొనితెచ్చుకున్నారని చెప్పారు.
కాగా, తాను ఏ తప్పూ చేయలేదని కమర చెబుతున్నారు.
‘వాళ్లు (మహిళలు) తమ కలను సాకారం చేసుకునేందుకు నేనెంతో కష్టపడి సాయం చేశాను. మిగతాదంతా దేవుడి దయ’’ అని ఆమె కనర్కీలో రిపోర్టర్లతో చెప్పారు.
మోసపూరిత పద్ధతులతో ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసినందుకు గాను కమరపై కేసు నమోదయ్యింది.
ఇవి కూడా చదవండి:
- పాప వైద్యం కోసం 45 రోజుల ప్రయాణం!
- ముందు మనిషిని, తర్వాతే డాక్టర్ని: డోలీ మోసిన ఒడిశా డాక్టర్
- ముందు బాబు పుట్టాడు.. మళ్లీ వెంటనే పాప పుట్టింది.. ఇద్దరూ చనిపోయారని వైద్యులు చెప్పారు.. పార్సిల్ చేశారు.. తర్వాత ఏమైంది?
- మీకు హార్ట్ ఎటాక్ ప్రమాదం ఉందో లేదో ఇది చెప్పేస్తుంది
- కేవలం 80 రూపాయలతో న్యుమోనియాకు చెక్!
- గ్రామాల్లో మరుగుదొడ్ల సమస్యకు సరికొత్త పరిష్కారం
- కొవ్వొత్తుల వెలుగులోనే పిల్లల్ని కంటున్నారు
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
- సోషల్ మీడియాలో మీ పిల్లల ఫొటోలు షేర్ చేస్తున్నారా?
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)