వీడియో: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఓడ్కా బాటిల్ చోరీ
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఓడ్కా బాటిల్ చోరీకి గురైందని డెన్మార్క్ పోలీసులు వెల్లడించారు. దాని విలువ దాదాపు రూ. 8.25 కోట్లకు పైనే ఉంటుందన్నారు. దుండగులు ఖాళీ సీసాను ఓ నిర్మాణ స్థలంలో వదిలేసి వెళ్లారని తెలిపారు.
బంగారం, వెండితో ఈ ఓడ్కా బాటిల్ను తయారు చేశారు. దాని బిరడా(మూత)లో వజ్రాలు పొదిగి ఉన్నాయి.
భిన్న రకాల ఓడ్కాలను ప్రదర్శనకు పెట్టిన కోపెన్హాగన్లోని 'కేఫ్ 33' బార్లోనే ఈ బాటిల్ను కూడా ఉంచారు.
మంగళవారం ఆ బాటిల్ చోరీకి గురైందని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మరుసటి రోజు నిర్వాహకులు గుర్తించారు.
అయితే.. సీసాను పగలగొట్టకుండా నగరంలోని ఓ నిర్మాణ స్థలంలో పడేసి వెళ్లిపోయారు.
"ఓడ్కా ఏమైందో తెలియదు. కానీ.. ఖాళీ బాటిల్ మాత్రం దొరికింది" అని పోలీసులు ఏఎఫ్పీ వార్తా సంస్థకు తెలిపారు.

ఫొటో సోర్స్, Dartz Motor Company
ఇప్పుడు ఖాళీ బాటిల్ కూడా అంతే విలువ ఉంటుందని కేఫ్ యజమాని చెబుతున్నారు. ఓడ్కాను నింపి దాన్ని మళ్లీ ప్రదర్శనకు పెడతామన్నారు.
ఈ బాటిల్ను డాట్స్ మోటార్ కంపెనీ నుంచి అరువుకు తీసుకున్నట్టు తెలిపారు.
ఇతర కథనాలు:
- బయో మద్యం: భయం లేదు.. దీంతో వాసన రాదు!
- హాఫిజ్ సయీద్ తనను తాను పాకిస్తాన్కు భారంగా భావిస్తున్నారా?
- 'నాన్న తప్పించుకున్నాడు.. మేం దొరికిపోయాం'
- ‘భీమా-కోరెగాం అల్లర్ల వెనుక అసలు కుట్ర ఏమిటి?’
- వెయ్యేళ్ల పాత్ర.. వెల రూ.248 కోట్లు
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- థాయ్లాండ్లో పురుషాంగాన్ని తెల్లగా మార్చే చికిత్స
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









