పార్వతి ఒడిలో శివుడు సేదతీరే అరుదైన శివాలయం విశేషాలు తెలుసా?
చుట్టూ కొండలు, పచ్చటి పొలాలు మధ్యలో తిరుపతి నుంచి నాగలాపురం మీదుగా చెన్నై వెళ్లే ఒక హైవే. ఆ పక్కనే రంగురంగుల గోపురం ఉన్న ఒక ఆలయం. ఆ ఆలయంలోకి వెళ్తే గర్భగుడిలో.. పార్వతీ దేవి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్న స్థితిలో శివుడి విగ్రహం కనిపిస్తుంది.
శివాలయాల్లో ఎక్కడైనా శివుడు మనకు లింగాకారంలో మాత్రమే కనిపిస్తాడు. కానీ ఈ ఆలయంలో శివుడు ఇలా మానవ రూపంలో మిగతా దేవీ దేవతల్లాగే కనిపించడం ఇక్కడ మాత్రమే ఉంది.
ఈ ఆలయం తిరుపతికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు చివర్లోని సురుటిపల్లి గ్రామంలో మరో ఒకటిన్నర కిలోమీటరు వెళ్తే తమిళనాడు వస్తుందనగా రోడ్డు పక్కనే ఆ ఆలయం కనిపిస్తుంది. తమిళనాడులో మొదట వచ్చే ఊతుకోట పట్టణం ఈ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
ఈ ఆలయంలోని శివుడి పేరు పళ్లికొండేశ్వరుడు. పళ్లికొండు అంటే తమిళంలో పడుకోవడం.

ఇవి కూడా చదవండి:
- మహాశివరాత్రి: శైవ ఆలయమైన శ్రీకాళహస్తికి మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏంటి
- వారణాసి: మేకలకు సైతం బొట్టు పెట్టి పూజించే ఈ నగరాన్ని చూసిన ఒక విదేశీయుని అనుభవం ఏంటి
- బెలూన్లు, డ్రోన్లు, శాటిలైట్లు... పరాయి దేశాల మీద గూఢచర్యం కోసం వీటిని ఎలా వాడతారు?
- పుతిన్ ప్రొటోకాల్ పక్కనపెట్టి అజిత్ డోభాల్తో భేటీ కావడంపై పాకిస్తాన్లో ఎందుకు చర్చ జరుగుతోంది?
- ‘పది రోజుల పసిగుడ్డుతో సహా శిథిలాల కింద సమాధై.. నాలుగు రోజుల పాటు ఎలా బతికానంటే..’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



