కారంచేడు హింసాకాండకు నేటితో 36 ఏళ్లు, బాధితులకు న్యాయం జరిగిందా?

వీడియో క్యాప్షన్, కారంచేడు హింసాకాండకు నేటితో 36 ఏళ్లు, బాధితులకు న్యాయం జరిగిందా?

కారంచేడు మారణకాండకు నేటితో 36 ఏళ్లు. రాజకీయంగా, సామాజికంగా కులం పోషిస్తున్న పాత్రను, ముఖ్యంగా దళితుల స్థితిగతులను చర్చనీయాంశంగా మార్చిన ఘటన కారంచేడు.

హరిత విప్లవం సాగిన ప్రాంతాల్లో దాని వల్ల బలపడిన శూద్ర అగ్రకులాలు దళితుల మీద సాగించిన దాడిగా దీనికి సామాజిక క్రమంలో ప్రాధాన్యముందని విశ్లేషకులు భావిస్తారు.

తెలుగు నేల మీద జరిగిన ప్రధాన దాడులు కారంచేడు, చుండూరు.. రెంటిలోనూ పారిన నెత్తుటికి నీటి పారుదల కాల్వలు సాక్ష్యంగా ఉండడం సామాజిక పరిణామంలో కీలకమైన అంశంగా చూడాల్సి ఉంటుంది.

సాధారణంగా ఈ విషయంలో అంతగా చర్చలో ఉండని రాజకీయ నాయకుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు గత ఏడాది హఠాత్తుగా నాటి ఘటనలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడంతో మరొక్కమారు అది చర్చకు వేదికగా మారింది.

ఈ నేపథ్యంలో బీబీసీ తెలుగు కారంచేడు ఘటనతో ఉద్యమంతో సంబంధమున్న వ్యక్తులతో 2020 సంవత్సరంలో మాట్లాడింది.

ఇదీ ఆ వీడియో కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)