సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ

వీడియో క్యాప్షన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి ఏడాది కావొస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అనేది ఇప్పటికి వీడని మిస్టరీగానే మిగిలింది.

ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఐదు ఇన్వెస్టిగేటింగ్ సంస్థలు పూనుకున్నప్పటికీ, ఇంతవరకూ విజయం సాధించలేదు.

34 ఏళ్ల సుశాంత్ 2020 జూన్ 14న తన ఇంట్లోనే చనిపోయారు. మొదట్లో ఇది ఆత్మహత్య అంటూ రిపోర్టులు వచ్చాయి. కానీ, రోజులు గడుస్తున్నకొద్దీ ఈ కేసు అనేక మలుపులు తిరిగింది.

ముంబై పోలీస్, బిహార్ పోలీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.

సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని ముంబయి పోలీసులు చేసిన ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

సీబీఐ దర్యాప్తు ఫలితాలను ఇంకా వెల్లడించలేదు.

ఈ కేసులో పైకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్ సిండికేట్ కోణాన్ని ఎన్‌సీబీ పరిశోధిస్తోంది. ఇందులో అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు చోటు ఉన్నట్లు ఇప్పటివరకు రుజువులు కనిపించలేదని ఈడీ చెబుతోంది.

ఇంతకీ ఈ కేసు ఏ దిశగా కదులుతోంది? దర్యాప్తు ఫలితాలు ఏం చెబుతున్నాయి? పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)