హైదరాబాద్: కూకట్పల్లిలో కాల్పులు జరిపి ఏటీఎం దోపిడీ - Newsreel

కూకట్పల్లిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలో ఆగంతుకులు సిబ్బంది మీదా, సెక్యురిటీ గార్డు మీదా కాల్పులు జరిపి డబ్బులు తీసుకుని పారిపోయారు.
ఏటీఎంలో క్యాష్ నింపుతుండగా ఈ ఘటన జరిగిందని సెక్యూరిటీ గార్డు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆగంతుకుడి చేతిలో తుపాకీ కనబడటంతో తాము భయపడిపోయామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు ఏటీఎం ముందు పడిపోయినట్లు వీడియోలో కనిపించింది. ఆ తర్వాత వారిద్దరి ఆసుపత్రికి తరలించారు.
కాల్పులు జరిపిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు.

కోవిడ్: 24 గంటల్లో 3,79,257 పాజిటివ్ కేసులు.. 3,645 మరణాలు

ఫొటో సోర్స్, API/gettyimages
భారత్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు మునుపెన్నడూ లేని స్థాయిలో నమోదయ్యాయి.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,79,257 పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,645 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తంగా 2,69,507 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జయ్యారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524కి చేరగా మృతుల సంఖ్య 2,04,832 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం దేశంలో 30,84,814 యాక్టివ్ కేసులున్నాయి.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- కరోనావైరస్: భారతదేశంలో 3 లక్షలు దాటిన రోజువారీ కోవిడ్ కేసులు...
- నోబెల్కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- బానిసలుగా వచ్చి బాద్షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








