వంటకు కూడా పనికిరాని కర్రతో జీవకళ ఉట్టిపడే బొమ్మలు.. 'ఏటికొప్పాక' విశేషాలు ఇవీ

వీడియో క్యాప్షన్, వంటకు కూడా పనికిరాని కర్రతో జీవకళ ఉట్టిపడే బొమ్మలు.. 'ఏటికొప్పాక' విశేషాలు ఇవీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 'మన్ కీ బాత్' లో ఏటికొప్పాక బొమ్మల విశిష్టతను ప్రస్తావించారు. ఏటికొప్పాక బొమ్మలు పీచు లేకుండా, నునుపుగా ఉంటాయనీ దీని వల్ల పిల్లలకు ఎలాంటి గాయాలూ కావని చెప్పారు.

ఈ కళ పురోగతి కోసం ఏళ్లుగా కృషి చేస్తూ వివిధ పరిశోధనలు చేస్తున్న సీవీ రాజు అనే కళాకారుడి కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రధాని ప్రశంస తర్వాత చాలా మంది ఈ గ్రామానికి వచ్చి ఇక్కడి బొమ్మల ప్రత్యేకతలను, కళాకారుల పనితీరునూ తెలుసుకుంటున్నారు.

విశాఖపట్నం జిల్లాలో వరాహ నది ఒడ్డున ఏటికొప్పాక గ్రామం ఉంది. ఏటికొప్పాక బొమ్మలకు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)