కపిల్ దేవ్: ప్రపంచకప్ అందుకున్నాక ఏం చేశారు.. ధోనీ, కోహ్లి గురించి ఏమన్నారు?
"వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి మనం సుదీర్ఘ కాలం ఆడాల్సుంటుంది. విరాట్ మరో ఐదారేళ్లు పిచ్పై ఉంటే, తన సత్తా కొనసాగిస్తే అతడు ఎన్నో ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టగలడు".
భారత్కు 1983 వరల్డ్ కప్ అందించిన భారత క్రికెటర్ కపిల్ దేవ్ ఈ మాట అన్నారు. ఆయనను కలవడానికి బీబీసీ టీమ్ హరియాణాలోని మనేసర్లో ఉన్న ఒక గోల్ఫ్ క్లబ్ చేరుకుంది.
భారత జట్టులో సుదీర్ఘ కాలం వికెట్ల వెనుక తన జోరు చూపించిన ధోనీ లేని లోటు నుంచి టీమిండియా ఎలా కోలుకోగలదు?
ఈ ప్రశ్నకు కపిల్ దేవ్ "మొదట్లో మనం గావస్కర్ లేకుంటే జట్టు ఏమవుతుందని ఆలోచించాం. తర్వాత టెండుల్కర్ లేకుండా టీమ్ ఏమవుతుందో అనుకున్నాం. కానీ, జట్టు ఆ వ్యక్తుల కంటే చాలా పెద్దదని మనం గుర్తుంచుకోవాలి. ఆ వ్యక్తి మైదానంలో లేకుంటే మనం కచ్చితంగా మిస్ అవుతాం. కానీ ధోనీ దేశానికి ఎంత చేయాలో, అంత చేశాడు. అదే తలుచుకుంటూ దిగులు పడుతుంటే, మనం ముందుకు వెళ్లలేం" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: వధువు, వరుడు లేకుండా పెళ్లి వేడుక జరిగింది
- జింకల వేటకు పెంపుడు చిరుతలు... క్రూర మృగాలనే మచ్చిక చేసుకున్న కొల్హాపూర్ వాసులు
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
- సొమాలియాలో మిడతల దండయాత్ర.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
- షహీన్బాగ్: ‘దిల్లీ కాలుష్యంలో ఆశల గాలి పీల్చాలంటే ఇక్కడకు రావాల్సిందే’ - అభిప్రాయం
- కోనసీమలో కలకలం రేపిన బ్లో అవుట్, మూడోరోజు అదుపు చేసిన ఓఎన్జీసీ
- భారత్లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలను వదులుకుంటున్న యువకులు
- బడ్జెట్ 2020 :ఆదాయ పన్ను కొత్త శ్లాబ్స్తో యువత భవిష్యత్తుతో ఎందుకీ చెలగాటం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)