దిశ అత్యాచారం, హత్య కేసు ఫాస్ట్ ట్రాక్ విచారణకు ప్రత్యేక కోర్టు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ శివార్లలోని షాద్ నగర్ సమీపంలో దిశ అత్యాచారం, హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టును నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
నవంబర్ 27వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెటర్నరీ డాక్టర్ అయిన ఆ యువతిపై శంషాబాద్ తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర లారీ డ్రైవర్, క్లీనర్లుగా పనిచేస్తున్న నలుగురు యువకులు అత్యాచారం చేశారు. ఆమె స్కూటీకి పంక్చర్ వేసి, దానిని బాగు చేయిస్తామని చెప్పి, కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, చనిపోయిన తర్వాత పెట్రోలు, డీజిల్ పోసి కాల్చామని ఆ యువకులు తెలిపారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఈ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిగింది.
యువతి పేరును ‘దిశ’గా పరిగణించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు.
ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వచ్చింది. రాష్ట్ర హైకోర్టు సైతం ఆదేశాలు జారీ చేసింది.

ఫొటో సోర్స్, Govt of Telangana
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లేఖను అనుసరించి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ న్యాయ శాఖ కార్యదర్శి ఎ సంతోష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
‘‘షాద్ నగర్ పోలీసు స్టేషన్లో క్రైమ్ నంబర్ 784/2019 కింద నమోదైన దిశ అత్యాచారం, హత్య కేసు విచారణను వేగవంతం చేసేందుకు’’ ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహబూబ్ నగర్ మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జికి ఈ బాధ్యతల్ని అప్పగించారు.
నిందితులకు వారం రోజులు పోలీసు కస్టడీ
దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ షాద్ నగర్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ నలుగురు నిందితలు ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్లో ఉన్నారు. పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. పోలీసులు గురువారం వీరిని తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు.
ఫేస్బుక్లో అశ్లీల కామెంట్లు.. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
కాగా, దిశ అత్యాచారం, హత్యకు సంబంధించి ఒక ప్రముఖ మహిళను కించపరుస్తూ ఫేస్బుక్లో అశ్లీల, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు బుధవారం తెలిపారు.
సోమవారం ఈ కామెంట్లు చూసిన ఒక మహిళా డాక్టర్ రాయదుర్గం పోలీసు స్టేషన్కు ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశమని, నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి గ్రామంలో నివశిస్తున్న అనిల్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని, అనంతరం తొమ్మిదవ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- వెటర్నరీ డాక్టర్ సోదరి: ‘నేను కానీ, అక్క కానీ 100కి కాల్ చేయలేకపోవటానికి కారణం ఏంటంటే..’
- షాద్ నగర్ బాధితురాలి సోదరి: ‘‘నిజంగా ఆ సీరియస్నెస్ నాకు తెలియదు.. ప్రపంచం ఇంత క్రూరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’’
- గోడలు, గార్డులు లేని జైలు... పని చేసుకుని బతికే ఖైదీలు
- భారత్లో అత్యాచార ఘటనల వెనకున్న కారణాలేంటి?
- షాద్ నగర్ అత్యాచారం-హత్య: ‘ప్లీజ్ పాపా, కొంచెం సేపు మాట్లాడు, దెయ్యంలా వెంటపడిండు... నాకు భయం అయితాంది’
- మార్కెట్లోకి ఏడాది పాటు నిల్వ ఉండే కొత్త రకం ఆపిల్
- కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?
- బిడ్డ పుట్టిన నిమిషం లోపే బొడ్డు తాడు కత్తిరిస్తే ఏమవుతుంది
- #100WOMEN: మహిళ 'అందం' అనే భారాన్ని మోయాల్సిన అవసరం ఏముంది: నందితా దాస్
- ‘దిశ’ అత్యాచారం: "నాకు చాలా బాధేసింది.. ఆ బాధితురాలు కూడా సాటి ఆడదే" - ఓ నిందితుడి భార్య ఆవేదన
- విజయవాడ శ్రీలక్ష్మి హత్య నుంచి వరంగల్ పసిపాప అత్యాచారం, హత్య వరకు.. కేసుల ప్రస్తుత పరిస్థితి ఏంటి?
- శ్రీజ డెయిరీ: ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుల సంస్థ’.. ఇందులో సభ్యులు, యజమానులు అంతా మహిళలే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)








