IND Vs SA రెండో టెస్టు: ఇన్నింగ్స్ 137 పరుగులతో భారత్ విజయం

ఫొటో సోర్స్, Getty Images
పుణెలో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య భారత జట్టు దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్ 137 పరుగులతో విజయం సాధించింది.
మరో రోజు మిగిలుండగానే విజయం అందుకున్న భారత్ ఈ సిరీస్లో 2-0 ఆధిక్యం సంపాదించింది.
దక్షిణాఫ్రికాపై ఈ గెలుపుతో సొంతగడ్డపై వరుసగా 11 టెస్ట్ సిరీస్ విజయాలు అందుకున్న క్రికెట్ జట్టుగా కోహ్లీ సేన సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.
2013 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ భారత్ స్వదేశంలో ఆడిన అన్ని టెస్ట్ సిరీస్లనూ గెలుచుకుంటూ వస్తోంది.
ఇంతకు ముందు ఆస్ట్రేలియా రెండు సార్లు స్వదేశంలో ఆడిన పది టెస్టు సిరీస్ల్లో వరుసగా విజయం సాధించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
వరుసగా రెండు టెస్ట్ సిరీస్ విజయాలతో మొత్తం 200 పాయింట్లు సాధించిన భారత్.. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ పట్టికలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది.
నాలుగో రోజు ఆట ప్రారంభమైనప్పుడు భారత్... ముందు దక్షిణాఫ్రికాను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉంది. రాత్రి బౌలర్లకు విశ్రాంతి కూడా లభించడంతో బౌలింగ్కే సిద్ధమైన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాను ఫాలో-ఆన్కు ఆహ్వానించాడు.
మూడో రోజు 275 పరుగులకు ఆలౌట్ అయిన దక్షిణాఫ్రికా నాలుగో రోజు కూడా భారత బౌలర్ల ముందు చేతులెత్తేసింది. ఆరంభం నుంచే వికెట్లు పడడం, టాప్ ఆర్డర్ మరోసారి విఫలమవడంతో 189 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఓపెనర్ ఎల్గర్ 48, బౌమా 38, పరుగులు చేయగా ఫస్ట్ ఇన్నింగ్స్ హీరోలు ఫిలాండర్ (37), మహరాజ్ (22) మరోసారి స్కోరు పెంచే ప్రయత్నం చేశారు.
కెప్టెన్ డుప్లిసిస్ (5), డికాక్ (5) సహా ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
టెస్ట్ చాంపియన్ షిప్లో భారత్ టాప్
భారత బౌలర్లు ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు పడగొట్టగా, రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమి చెరో వికెట్ పడగొట్టారు.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ కేవలం 67.2 ఓవర్లలోనే కుప్పకూలింది.
భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 601/5 పరుగులకు డిక్లేర్ చేసింది. ఈ భారీ స్కోరుకు సమాధానంగా దక్షిణాఫ్రికా రెండు ఇన్నింగ్స్లో కలిపి 464 పరుగులు మాత్రమే చేయగలిగింది.
తొలి ఇన్నింగ్స్లో 254 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
ఈ విజయంతో భారత్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్లో 200 పాయింట్లతో ఏ జట్టుకూ అందనంత ఎత్తున టాప్ ప్లేస్కు చేరింది. ఈ జాబితాలో న్యూజీలాండ్ 60 పాయింట్లతో తర్వాత స్థానంలో ఉంది.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్ట్ అక్టోబర్ 19 నుంచి 23 వరకూ రాంచీలో జరగనుంది.
ఇవి కూడా చదవండి
- రోహిత్ శర్మ: టెస్టుల్లో అత్యధిక సిక్సర్ల రికార్డ్ బ్రేక్
- క్రికెట్: భారత్లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
- గుర్తింపు గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు, ఆటపైనే నా దృష్టి: కోనేరు హంపి
- ఇక చరిత్రను తిరగరాయాల్సిందేనా?
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- సెప్టెంబర్ 17: విలీనమా? విమోచనా?... 1948లో జరిగిన హైదరాబాద్ విలీనాన్ని ఎలా చూడాలి?- అభిప్రాయం
- అడ్వాణీని కోలుకోలేకుండా చేసిన ఆ ఒక్క తప్పు
- గోధ్రా కేసు: మరణ శిక్ష పడిన దోషులందరికీ శిక్ష తగ్గింపు
- హార్దిక్ పటేల్: ‘పటేళ్లలో సింహం’
- గుజరాత్: బ్రెజిల్కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది
- ఇస్లామిక్ యోగా: యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు చేస్తున్న గుజరాత్ ముస్లిం మహిళలు
- మోదీ వల్ల పాకిస్తాన్లో కశ్మీర్పై చర్చ స్వరూపమే మారిపోయిందా...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








