అఫ్గానిస్తాన్: యూనివర్సిటీల్లో మహిళల ప్రవేశాలను నిలిపివేస్తామని ప్రకటించిన తాలిబాన్లు
అఫ్గానిస్తాన్యూనివర్సిటీల్లో మహిళలకు ప్రవేశాన్ని నిలిపివేస్తున్నామని తాలిబాన్లు ప్రకటించినట్లు ఉన్నత విద్యా మంత్రి లేఖ ద్వారా తెలిసింది.
వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆయన భావిస్తున్నారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని చెప్పారు.
తాలిబాన్లు తీసుకున్న తాజా నిర్ణయం మహిళలకు ఉన్నత విద్యను దూరం చేస్తుంది. అఫ్గాన్లో ఇప్పటికే అనేక సెకండరీ పాఠశాలల్లో విద్యకు బాలికలు దూరమయ్యారు.
ఈ వార్త విన్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నానని బీబీసీకి కాబూల్ యూనివర్సిటీ విద్యార్థిని ఒకరు చెప్పారు.
మూడు నెలల క్రితమే వేలాది మంది విద్యార్థినిలు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలు రాశారు.
అక్కడ విద్యార్థినులు చదివే సబ్జెక్టులపై కూడా ఆంక్షలు విధించారు. వెటర్నరీ సైన్స్, ఇంజినీరింగ్, ఎకనమిక్స్, అగ్రికల్చర్ సబ్జెక్టులపై పరిమితులు విధించిన తాలిబాన్లు, జర్నలిజం సబ్జెక్టుపై తీవ్ర ఆంక్షలు విధించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- మెస్సీ వరల్డ్ కప్ సాధిస్తే, భారత అభిమానులు సచిన్ను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు
- ఫిఫా ప్రపంచ కప్ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా
- అవతార్ 2: ‘కథలో పస లేదు, కథనంలో వేగం లేదు, పాత్రల్లో దమ్ము లేదు.. టెర్మినేటర్ బెటర్’ - బీబీసీ రివ్యూ
- ఎలాన్ మస్క్: ట్విటర్ బాస్గా దిగిపోవాల్సిందేనంటూ యూజర్ల ఓటు - ఇప్పుడు పరిస్థితేంటో?
- ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్బాల్ పిచ్ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)






