జావా: ఆ అగ్నిపర్వతం దగ్గర ‘నైవేద్యం’ సమర్పిస్తారు

వీడియో క్యాప్షన్, ఇష్టమైన వస్తువును అగ్నిపర్వాత బిలంలో వేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
జావా: ఆ అగ్నిపర్వతం దగ్గర ‘నైవేద్యం’ సమర్పిస్తారు

అగ్నిపర్వతం పేలినపుడు, దాని చుట్టుపక్కల ప్రజలు వణికిపోతారు. దూరంగా వెళ్లిపోవడానికి పరుగులు పెడతారు. కానీ, ఈ పొగలు కక్కే అగ్నిపర్వతం దగ్గరకు వేల మంది ప్రజలు స్వయంగా వెళతారు. చాలా ఎత్తున్న ఒక పర్వతాన్ని ఎక్కి మరీ వారు ఇక్కడకు వస్తున్నారు.

ఇది ఇండోనేషియాలోని జావాలో ఉన్న మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం. ప్రజలు సజీవంగా ఉన్న ఈ అగ్నిపర్వతం అంచుల దగ్గరకు వెళ్లి, తమ పశువులను, పండ్లు, కూరగాయలను నైవేద్యంగా అందులో వేస్తారు.

టేంగడ్ సముదాయానికి చెందిన వీళ్లు.. శతాబ్దాల నాటి తమ సంప్రదాయ పండుగను జరుపుకోడానికి ఈ అగ్నిపర్వత బిలం దగ్గరకు వస్తుంటారు. ఈ పండుగను యదన్యా కసాదా అంటారు.

ఈ పండుగ తమ జీవితాల్లో సుఖసంతోషాలను తీసుకొస్తుందని వీరి విశ్వాసం.

అగ్ని పర్వతం

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)