ఏడీఆర్ నివేదిక: అత్యధిక విరాళాలు బీజేపీకే

ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని, దానిని రద్దు చేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది.

ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచడం సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ సందర్భంలో, జాతీయ పార్టీలకు అసలు విరాళాల తీరు ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం.

రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులు, పారదర్శకత అంశాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ అధ్యయనం చేస్తుంటుంది. ఏ జాతీయ పార్టీకి ఎంత మేర విరాళాలు అందాయనే వివరాలను ఏడీఆర్ తన నివేదికలో తెలిపింది. ఆ సమాచారాన్ని ఇక్కడ గ్రాఫిక్స్ రూపంలో చూద్దాం.

2022-23లో బీజేపీకి 90 శాతం కార్పొరేట్ విరాళాలు వచ్చాయని ఏడీఆర్ తన రిపోర్టులో తెలిపింది.

2022-23లో రూ. 850.438 కోట్ల విరాళాలు అందుకున్నట్లు ఆయా జాతీయ పార్టీలు ప్రకటించాయి. ఇందులో బీజేపీకి రూ.719.85 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.79.92 కోట్లు వచ్చాయని ఏడీఆర్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)