మంత్రసాని పశ్చాత్తాపం: పురిట్లోనే ఆడపిల్లల గొంతు నులిమిన చేతులు ఇప్పుడు ఏం చేస్తున్నాయి?
మంత్రసాని పశ్చాత్తాపం: పురిట్లోనే ఆడపిల్లల గొంతు నులిమిన చేతులు ఇప్పుడు ఏం చేస్తున్నాయి?
దాదాపు ముప్పై ఏళ్ల కిందట ఒక జర్నలిస్టు బిహార్లోని ఓ మంత్రిసాని బృందాన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు దిగ్భ్రాంతికరమైన విషయాలు చెప్పారు. ఆడపిల్లల కుటుంబాల ఆదేశాలమేరకు తాము పురిటికందులను చంపేశామని వారు కెమెరా ముందు మాట్లాడుతూ అంగీకరించారు.
ఈ దిగ్భ్రాంతి కలిగించే అంగీకారం ఇప్పటిదాకా చూడనిది. గ్రామీణ భారతదేశంలో కలవరపరిచే పురిటికందుల హత్యల చరిత్రను అన్వేషించే డాక్యుమెంటరీకి ఇదే ప్రారంభంగా మారింది.
కానీ ఈ కథ హత్యలతో ముగిసిపోలేదు. ఇది పురిట్లోనే ఎదురయ్యే చావు నుంచి ఆడపిల్లలను రక్షించిన తీరునూ కళ్లకు కడుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









