వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నివేదిక ఏం చెప్పింది?

వీడియో క్యాప్షన్, కాలుష్యాన్ని తగ్గించేందుకు అన్ని వైపుల నుంచి ముందడుగు వేయాలని సూచన

వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అన్ని వైపుల నుంచి ముందడుగు వేయాలని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక సూచించింది.

ఫ్రెడ్డీ తుపాను చాలా రోజుల పాటు ప్రభావం చూపిన ఉష్ణ మండల తుపానుగా రికార్డులకెక్కిందంటున్నారు వాతావరణ నిపుణులు. వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి తీవ్రమైన తుపాన్లు రానున్న రోజుల్లో మరిన్ని వస్తాయని తాజా నివేదిక చెబుతోంది.

యూరప్‌లోని ఆల్ప్స్ హిమానీ నదాలు మొత్తం పరిమాణంలో గత ఏడాది ఆరు శాతం కోల్పోయాయంటూ సమస్య తీవ్రతను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ గుర్తు చేశారు.

మారుతున్న వాతావరణ పరిస్థితుల్ని అదుపు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. కర్బన ఉద్గారాలను తగ్గించే సాంకేతికత, శిలాజ ఇంధనాలను మండించడం వల్ల ఏర్పడే గ్రీన్ హౌస్ వాయువుల్ని నియంత్రించేందుకు పునరుత్పాదక ఇంధన వనరులతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు లాంటివి తక్షణావసరమని చెప్పారు. ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)