ఇజ్రాయెల్ - పాలస్తీనా మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. ఈ శాంతి కొనసాగేనా?
ఇజ్రాయెల్ – పాలస్తీనా మిలిటెంట్ల మధ్య మూడు రోజుల పాటు కొనసాగిన ఘర్షణకు ముగింపు పలకటానికి చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరుపక్షాలూ చాలావరకూ పాటిస్తున్నట్లుగానే కనిపిస్తోంది.
ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ నాయకుడు ఒకరిని ఇజ్రాయెల్ హత్య చేయటంతో తాజా హింస చెలరేగింది.
తమ నేత హత్యకు తీవ్రంగా ప్రతిస్పందించిన ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ఇజ్రాయెల్ మీదకు పదుల సంఖ్యలో రాకెట్లు, మోర్టార్లను పేల్చింది.
గాజా మీద శుక్రవారం నుంచి జరిగిన ఇజ్రాయెలీ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారని పాలస్తీనా అధికారులు చెప్తున్నారు.
బీబీసీ మిడిల్ ఈస్ట్ కరెస్పాండెంట్ యొలాండే నెల్ కథనం.
ఇవి కూడా చదవండి:
- 'బిన్ లాడెన్ తల తీసుకురా': అల్ ఖైదా అధినేతను వేటాడటానికి అమెరికా పంపిన సీఐఏ గూఢచారి
- బాసర ట్రిపుల్ ఐటీ: సమస్యలకు నిలయంగా ఎందుకు మారింది, లోపం ఎక్కడుంది?
- సయఫ్ అల్ అదల్: జవహిరి తర్వాత అల్ఖైదా నాయకుడు ఇతడేనా, ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంటూ నాయకత్వ బాధ్యతలు సాధ్యమేనా
- గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. టెల్ అవీవ్పై రాకెట్లు ప్రయోగించిన పీఐజే: పాలస్తీనా పౌరులు, మిలిటెంట్ల మృతి
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
- వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి ఎందుకు ఒప్పుకొన్నారు? ఇప్పుడు ఏం చేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)