కరోనావైరస్: యాంటీబాడీ పరీక్ష అంటే ఏంటి?
ఎలాంటి లక్షణాలూ లేకపోయినా కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలామంది కోవిడ్-19 బారిన పడుతున్నారు.
ఇలా లక్షణాలు లేనివారికి కరోనావైరస్ సోకిందో లేదో తెలుసుకునేందుకు యాంటీబాడీ పరీక్ష చేయాల్సి ఉంటుంది.
చేతికి సూది గుచ్చి, రక్తాన్ని సేకరించి, దానిని ఒక స్ట్రిప్పై వేసి ఈ పరీక్ష జరుపుతారు.
ప్రస్తుతం కరోనావైరస్ సోకిందో లేదో తెలుసుకోవడానికి ముక్కులో స్రావాన్ని పరీక్షిస్తున్నారు.
అయితే, ఈ పరీక్షలు శరీరంలో వైరస్ ఉందో లేదో మాత్రమే తెలుస్తాయి.
అప్పటికే వైరస్ వచ్చి పోయిందా? లేదా? అన్న విషయాన్ని మాత్రం చెప్పవు. అంటే ఒకవేళ వైరస్ బారిన పడి కోలుకుంటే స్వాబ్ పరీక్షలో ఆ విషయం వెల్లడి కాదు.
యాంటీబాడీ పరీక్ష వల్ల ఇంకా ఏమేం లాభాలు ఉన్నాయో పై వీడియోలో చూడండి.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)