Howdy Modi: భారత్, అమెరికా ప్రజలను తీవ్రవాదుల నుంచి కాపాడుకుంటాం - ట్రంప్

అమెరికాలోని హూస్టన్లో నిర్వహిస్తున్న 'హౌడీ మోదీ' కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్ఆర్జీ స్టేడియంకు చేరుకున్న భారత ప్రధాని మోదీకి నిర్వాహకులు, టెక్సస్ ప్రభుత్వ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
కొద్దిసేపటి కిందట అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా సభా వేదిక వద్దకు చేరుకున్నారు.
సభనుద్దేశించిన మాట్లాడిన మోదీ ‘‘మిస్టర్ ట్రంప్ మీరు 2017లో మీ కుటుంబాన్ని నాకు పరిచయం చేశారు. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తున్నాను’’ అనగానే సభకు హాజరైనవారంతా పెద్ద పెట్టున చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
ఈ సభతో భారత్, అమెరికాల మైత్రి శిఖర స్థాయికి చేరిందని మోదీ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ గెలవడం ఖాయమని ఆయన అన్నారు.
రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలపడుతుందని, ట్రంప్ను కలిసిన ప్రతిసారీ తనకు స్నేహ హస్తాన్ని అందించారని మోదీ అన్నారు.
మోదీ పిలిస్తే ముంబయి వస్తాను: ట్రంప్
ట్రంప్ మాట్లాడుతూ తనను ఈ సభకు పిలిచినందుకు సంతోషంగా ఉందని, ఈ చరిత్రాత్మక సభకు రావడం తన అదృష్టమన్నారు.
మోదీ నాయకత్వంలో భారత్లో 30 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చారని.. అది అపూర్వమని ట్రంప్ అన్నారు.
‘‘అమెరికా, భారత్ స్నేహ బంధానికి ఈ సమావేశం నిదర్శనం, దీనికి 50 వేలమంది హాజరుకావడం స్ఫూర్తిదాయకం’’ అన్నారాయన.
వచ్చే నెలలో భారత్లోని ముంబయిలో మొట్టమొదటి ఎన్బీఏ బాస్కెట్ బాల్ మ్యాచ్ జరగబోతోందని.. మోదీ ఆహ్వానిస్తే తాను వచ్చే అవకాశముందన్నారు.
అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్ర కీలకమని ప్రస్తుతించారు. భారత్, అమెరికా పౌరులను ’ఉగ్రవాదం’ నుంచి కాపాడుకుంటామని ట్రంప్ చెప్పారు.

అంతకుముందు.. ఈ కార్యక్రమంలో మిత్రుడు మోదీతో పాటు వేదికను పంచుకోనున్నానని ట్రంప్ ట్వీట్ చేయగా.. మోదీ దానికి స్పందనగా, మీ రాక కోసం ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హూస్టన్లో 72 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించగల సామర్థ్యమున్న ఎన్ఆర్జీ ఫుట్బాల్ స్టేడియం ఈ 'హౌడీ మోదీ' సభకు వేదిక కానుంది. టెక్సస్ ఇండియా ఫోరం, మరో 600 సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 50 వేల మందికి పైగా భారత సంతతి అమెరికన్లు పాల్గొంటున్నారు.

ఫొటో సోర్స్, Ani
మోదీ, ట్రంప్లిద్దరూ హాజరవుతుండడంతో దీనికి ప్రాధాన్యమేర్పడింది.


ఎన్ఆర్జీ స్టేడియంలో 3 గంటలపాటు జరిగే ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8.30కు ప్రారంభమై రాత్రి 11.30 వరకు కొనసాగుతుంది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 1
మరోవైపు 'హౌడీ మోదీ' కార్యక్రమానికి హాజరవుతున్న మోదీ ఎదుట ఆయన తీసుకున్న 'కశ్మీర్ స్వయం ప్రతిపత్తి' రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు కొందరు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే స్టేడియం వద్దకు చేరుకున్న కొందరు నిరసనలు తెలుపుతున్నారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 2

కశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించినందుకు నిరసనగా హూస్టన్లోని ముస్లిం, మైనారిటీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

ఇందుకోసం సోషల్ మీడియాలో పిలుపునిచ్చిన కొందరు ఎన్ఆర్జీ స్టేడియం వెలుపల మోదీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- 'మోదీ గెలిస్తే శాంతికి మెరుగైన అవకాశాలు'
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరం కారకస్లో రాత్రి జీవితం ఎలా ఉంటుంది?
- అమెరికాలో 10శాతం మందికే పాస్పోర్టులు.. నిజమేనా?
- కశ్మీర్పై ట్రంప్ ఎందుకంత శ్రద్ధ చూపిస్తున్నారు?
- ప్రపంచాన్ని ట్రంప్ మరింత ప్రమాదంలోకి నెట్టేశారా?
- గాంధీకి దగ్గరైన ఈ ఎనిమిది మంది మహిళల గురించి మీకు తెలుసా?
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- 18 సంవత్సరాల్లోపు యూజర్లకు ఇలాంటి పోస్టులు ఇక కనిపించవు - ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








