వైట్ హౌస్కు మతి చలించింది: ట్రంప్ కొత్త ఆంక్షలపై ఇరాన్ విమర్శ

ఫొటో సోర్స్, AFP
ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయాతుల్లా ఖొమైనీకి కూడా వర్తింపజేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోమవారం విధించిన కొత్త ఆంక్షలపై ఇరాన్ మండిపడింది.
చర్చలు కోరుకొంటున్నామంటూ అమెరికా చెబుతున్న మాట అబద్ధమని ట్రంప్ తాజా చర్యలు చాటుతున్నాయని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ వ్యాఖ్యానించారు. అమెరికా కొత్త ఆంక్షలు నిరుపయోగమని విమర్శించారు.
ట్రంప్ తాజా చర్యలు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌస్కు మతి చలించినట్లు సూచిస్తున్నాయని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు.
ఆంక్షల్లో ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జావాద్ జరీఫ్ను లక్ష్యంగా చేసుకొనేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నట్లు రౌహానీ చెప్పారు.
జరీఫ్ను లక్ష్యంగా చేసుకొని ఇదే వారంలో ఆంక్షలు విధిస్తామని అమెరికా ఆర్థిక శాఖ తెలిపింది. 2015 నాటి అణు ఒప్పందం చర్చల్లో ప్రధాన పాత్ర పోషించినవారిలో జరీఫ్ ఒకరు.

ఫొటో సోర్స్, EPA
ఆంక్షలపై ట్రంప్ ఏమన్నారు?
అమెరికా డ్రోన్పై దాడి చేయడం, ఇతర కారణాలతో తాము అదనపు ఆంక్షలు విధించామని ట్రంప్ సోమవారం చెప్పారు. ఈ ఆంక్షలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు ఇచ్చిన తర్వాత అధ్యక్ష భవనంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ- అయాతుల్లా ఖొమైనీని కూడా ఈ ఆంక్షల పరిధిలో చేర్చడం చాలా అవసరమని తెలిపారు.
"ఇరాన్ సుప్రీం నేతలు తమ పాలనలో జరిగే అన్నిటికీ బాధ్యులవుతారు. వారికి వారి దేశంలో చాలా గౌరవం ఉంటుంది. వారి అధీనంలో చాలా ప్రమాదకరమైనవి ఉంటాయి. ఈ ఆంక్షల తర్వాత ఇరాన్ సర్వోన్నత నాయకుడు, ఆయన కార్యాలయం, దానికి సంబంధించిన మిగతా అందరూ ఏదో ఒక విధంగా ఆర్థిక సహకారం కోల్పోతారు" అని ట్రంప్ చెప్పారు.
తారస్థాయికి చేరిన ఉద్రిక్తతలు
ఇరాన్, అమెరికా మధ్య 2018 మే నుంచి ఉద్రిక్తతలు పెరుగుతూ వస్తున్నాయి. గత కొన్ని వారాల్లో అవి తారస్థాయికి చేరాయి. జూన్ 27 తర్వాత తమ అణు కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్ధారిత పరిధి కంటే పెంచుతామని ఇరాన్ ఇటీవల ప్రకటించింది.
ఇరాన్, మరో ఆరు దేశాలతో కలిసి 2015లో కుదుర్చుకున్న చరిత్రాత్మక అణు ఒప్పందం నుంచి అమెరికా నిరుడు తనకు తానుగా వైదొలగింది. ఈ పరిణామంతో ఇరాన్-అమెరికా సంబంధాలు బీటలు వారాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఇరాన్ కూడా ఒప్పందం నుంచి పాక్షికంగా తప్పుకొంది.
తాను ఒప్పందం నుంచి వైదొలగిన తర్వాత అమెరికా ఇరాన్పై తిరిగి ఆంక్షలను విధిస్తూ వస్తోంది. ఒప్పందంపై తిరిగి చర్చలు జరిపేలా ఇరాన్ను ఒత్తిడి చేసేందుకు అమెరికా ఇలా వ్యవహరిస్తోంది.
ఉద్రిక్త పరిస్థితుల మధ్య గల్ఫ్లో సౌదీ చమురు ట్యాంకర్లపై దాడులు జరిగాయి. వాటి వెనుక ఇరాన్ హస్తం ఉందని అమెరికా అంటుంటే, ఇరాన్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
కొన్ని రోజుల క్రితం ఒక అమెరికా డ్రోన్ను ఇరాన్ కూల్చేసింది. డ్రోన్ అప్పుడు అంతర్జాతీయ సముద్ర సరిహద్దుల్లో ఉందని అమెరికా అంటుంటే, ఇరాన్ మాత్రం అది తమ సరిహద్దుల్లోకి ప్రవేశించిందని చెబుతోంది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఇవి కూడా చదవండి:
- సామాన్యుడి విజయాన్ని సహజంగా చూపించిన 'మల్లేశం'
- కబీర్ సింగ్ సినిమాకు ఈలలు, చప్పట్లు దేనికి...
- ‘‘అమ్మానాన్న పెళ్లి చేసుకోవాలన్నారు.. నేను మాత్రం డీజేగా మారా’’
- చంద్రయాన్-2 మిషన్ సూత్రధారులు ఈ ఇద్దరు మహిళలు
- ఆలయంలో ఉత్సవాలకు ఏనుగులు.. అడ్డు చెబుతున్న జంతు సంరక్షకులు
- ‘తాలిబన్ల ఆదాయం ఏటా రూ.లక్ష కోట్లు’.. నిజమేనా?
- అసద్ పైచేయికి రసాయన ఆయుధాలే కారణమా?
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- గాడిద లాగే టాబ్లెట్ కంప్యూటర్తో ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత
- అంతులేని ప్రశ్న: రోజుకు ఎన్ని జంతువులు పుడుతున్నాయి?
- ట్రావెల్ ఫొటో పోటీలు 2019: చూపుతిప్పుకోనివ్వని ఫొటోలు... విజేతలు వీరే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









