You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జపాన్లో వరద మిగిల్చిన విషాదానికి ఈ ఫొటోలే నిదర్శనం
కుండపోత వర్షాలతో పశ్చిమ జపాన్ ప్రాంతం అతలాకుతలమైంది.
భారీ వరదలతో పాటు.. పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో 141 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం తెలిపింది. మరో 50 మందికి పైగా గల్లంతయ్యారు.
జపాన్లో గత మూడు దశాబ్దాల కాలంలో వర్షాల వల్ల ఇంత భారీగా ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి.
లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలు నీటిలో మునిగిపోయాయి. పలు ఇళ్లు కూలిపోయాయి.
అనేక నివాసాలకు నీటి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో 70,000 మంది అత్యవసర సహాయక సిబ్బందిని ప్రభుత్వం మోహరించింది.
రహదారులు కోతలకు గురయ్యాయి. అనేక వాహనాలు బురదలో చిక్కుకుపోయాయి. కొన్ని చోట్ల ఘాట్ రోడ్లు తెగిపోయాయి.
గత గురువారం నుంచి ఇప్పటి వరకు జూలైలో నమోదవ్వాల్సిన సాధారణ వర్షపాతం కంటే మూడు రెట్ల అధికంగా వర్షం కురిసింది.
లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ ప్రాంతంలో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వరదల నేపథ్యంలో జపాన్ ప్రధాని షింజో అబే తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- వ్యవసాయం: కనీస మద్దతు ధరల గురించి యువత తెలుసుకోవాల్సింది ఏంటి?
- స్పైడర్మ్యాన్ సహ సృష్టికర్త మృతి
- హెచ్ఐవీ వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు
- సోషల్: అద్దె ఇంటికి ఎవరైనా అద్దె కట్టాల్సిందే కదా, మరి కులం అడగడం ఎందుకు?
- #లబ్డబ్బు: ఆన్లైన్లో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయండి ఇలా..
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- డ్రెస్కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
- ప్రపంచంలోనే కష్టమైన ప్రయాణం!
- ఇంతకూ మనం పది శాతం మెదడునే వాడుతున్నామా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)