You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అసలు జీఈఎస్ (అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు) అంటే?
ఇవాంకా ట్రంప్.. ప్రస్తుతం హైదరాబాద్ జపిస్తున్న మంత్రం. ఈ నెల 28-30 మధ్య జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ఆమె పాల్గొననున్నారు.
దీన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది.
ఈ నేపథ్యంలో అసలు జీఈఎస్ అంటే ఏమిటి? ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ సదస్సు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
ప్రధాన లక్ష్యం
ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదార్లను ఒక తాటిపైకి తీసుకు వచ్చే ఉద్దేశంతో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)ను ఏర్పాటు చేశారు.
ముఖ్య విధులు
- ప్రభుత్వం, ప్రైవేటు రంగానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించడం
- అంతర్జాతీయంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను పంచుకునేందుకు వేదిక ఏర్పాటు చేయడం
- కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలు కల్పించడం
- ప్రధానంగా యువ పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థల (స్టార్టప్స్)ను ప్రోత్సహించడం
- పెట్టుబడులు పొందేందుకు సహాయం చేయడం
- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం
ఇవి కూడా చూడండి
ఎప్పుడు నిర్వహిస్తారు?
- ఈ సదస్సును ప్రతి ఏడాదీ నిర్వహిస్తారు.
- తొలి సదస్సు 2010లో అమెరికాలో జరిగింది.
ప్రయోజనాలు
- వినూత్న ఆలోచనలతో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
- ఇప్పటి వరకు ఎన్నో ఆలోచనలు ఇలా వ్యాపార సంస్థలుగా మారాయి.
- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదార్లను కలుసుకోవచ్చు.
- వ్యాపారాన్ని సులభంగా నిర్వహించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేయవచ్చు.
- యువత వ్యాపార నైపుణ్యాలను పెంచుకునే వీలు కలుగుతుంది.
జీఈఎస్-2017
వేదిక: హైదరాబాద్
ఎప్పుడు: అమెరికాతో కలిసి నీతి ఆయోగ్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ నెల 28 నుంచి 30 వరకు సదస్సు జరుగుతుంది. దక్షిణాసియాలో తొలిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
అంశం: "ఉమెన్ ఫస్ట్, ప్రాస్పర్టీ ఫర్ ఆల్ " అనే అంశంతో మహిశా పారిశ్రామికవేత్తలకు పెద్ద పీట వేయనున్నారు. అలాగే అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.
ప్రతినిధులు: ప్రపంచవ్యాప్తంగా 1500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్న ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
ఇవి కూడా చూడండి
గత సమావేశాలు ఇలా..
తొలిసారి 2010లో నిర్వహించిన సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇచ్చింది. ఆ తరువాత టర్కీ (2011), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (2012), మలేసియా (2013), మొరాకో (2014), కెన్యా (2015), అమెరికా (2016)లలో సదస్సులు జరిగాయి. ప్రస్తుతం 8వ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది.
(ఆధారం: గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్-2017, 2016 వెబ్సైట్స్)
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)