వలస కూలీల కష్టం: ఇంటికి చేరేందుకు 450 కిలోమీటర్లు నడిచిన చిన్నారి

వీడియో క్యాప్షన్, 450 కిలోమీటర్లు నడిచి వెళ్లిన చిన్నారి

ఈ చిన్నారి మహారాష్ట్రలోని పుణె నుంచి అదే రాష్ట్రంలోని ముద్కేడ్‌కు నడిచి వెళ్తోంది. మొత్తం 450 కిలోమీటర్ల ప్రయాణం.

లాక్‌డౌన్ కష్టాలకు ఎదురీదలేక నడుచుకుంటూ అయినా సొంతూరికి వెళ్లిపోవాలని మూటాముల్లె నెత్తిన పెట్టుకుని బయలుదేరిని తల్లిదండ్రులతో కలిసి నడుస్తోందీ బాలిక.

ఇలా పుణె, ముంబయి, ఇతర నగరాల్లో ఉన్న వలస కూలీలు తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు.

'నేను ఉదయం 3 గంటలకే నిద్ర లేచాను. అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాను. కొన్నిసార్లు రాత్రి 2 గంటల నుంచే నడక మొదలుపెడుతున్నాం. మధ్యాహ్నం కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నాం. చీకటిపడ్డాక మళ్లీ నడక ప్రారంభిస్తున్నాం'' అన్నారు వలస కూలీ అమీనా బీ.

ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించినా మహారాష్ట్రలో వలస కూలీలకు అవి అందుబాటులో లేవు.

'రెండు నెలలుగా పనిలేదు. నడిచి వెళ్తున్నా మమ్మల్ని ఆపుతున్నారు. మెడికల్ సర్టిఫికేట్లు తెమ్మంటే అవీ తెచ్చాం'' అన్నారామె.

అయితే, దారిలో వారికి కొందరు ఆహారం ఇస్తున్నారు.. అది కొంత ఊరట కలిగించే విషయమే.

రాష్ట్రప్రభుత్వ బస్సులు తిరుగుతున్నా వాటిని ఆపితే అందులో తమను ఎక్కించుకోవడం లేదని చెబుతున్నారు ఇలా నడుచుకుంటూ వెళ్తున్న కూలీలు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)