'నందాదేవి' అధిరోహణలో చనిపోయిన పర్వతారోహకుల చివరి వీడియో
భారత్లోని రెండో అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతం నందాదేవిని అధిరోహించేందుకు వెళ్లి చనిపోయిన పర్వాతారోహకుల బృందం చివరి వీడియో ఒకటి లభించింది.
ఇందులో ఒక భారతీయ గైడ్, నలుగురు బ్రిటన్ వాసులు, ఇద్దరు అమెరికన్లు, ఒక ఆస్ట్రేలియన్ హిమాలయాల్లోని ఒక శిఖరాన్ని తాడు సాయంతో అధిరోహిస్తున్నారు.
ఈ పర్వతారోహకులు మే 13న నందాదేవి అధిరోహణను మొదలుపెట్టారు. వీరికి మే 26న బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
బృందంలో ఏడుగురి మృతదేహాలు జూన్లో దొరికాయి. అనుభవజ్ఞుడైన బ్రిటన్ పర్వతారోహక గైడ్ మార్టిన్ మోరాన్ ఆచూకీ ఇంకా తెలియడం లేదు.
ఏడుగురి మృతదేహాలను వెలికితీసిన ప్రదేశానికి సమీపంలోనే ఈ వీడియో ఉన్న 'గోప్రో' కెమెరా లభించింది. ఇది మంచులో కప్పుకొనిపోయి ఉంది.
ఒక నిమిషం 55 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు(ఐటీబీపీ) అధికారులు సోమవారం విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్: హిమాలయాల్లో ఎనిమిది మంది పర్వతారోహకుల ప్రాణాలు తీసిన మంచు తుపాను
- జిమ్మీ నీషామ్: ప్రపంచకప్ మ్యాచ్లు ఆడుతూనే... డిగ్రీ పరీక్షలు రాస్తున్న ఆల్రౌండర్
- యునెస్కో వారసత్వ ప్రదేశాల జాబితాలో జైపూర్
- ముస్లిం కుటుంబాల నుంచి పిల్లలను మేం వేరు చేయడం లేదు: చైనా
- అనంతపురం కాలేజీ వైరల్ వీడియో వెనుక అసలు కథ
- నాయకుడెవరూ లేకపోయినా.. యాప్స్ ద్వారా భారీ ఉద్యమం ఎలా సాధ్యమైంది?
- IND vs NZ: మాంచెస్టర్ మొగ్గు భారత్కా, న్యూజీలాండ్కా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)