కరుణానిధి జీవితంలో ప్రధాన ఘట్టాలు.. కీలక మలుపులు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆగస్టు 7న మరణించారు. దాదాపు 6 దశాబ్దాల కరుణ రాజకీయ ప్రయాణంలోని ప్రధాన ఘట్టాలను సంవత్సరాలు, తారీఖులతోపాటు మీకోసం అందిస్తోంది బీబీసీ.
1924 జూన్ 3: నాగపట్నం జిల్లా తిరుక్కువలై గ్రామంలో అంజుగమ్, ముత్తువేల్ దంపతులకు కరుణానిధి జన్మించారు.
1938: జస్టిస్ పార్టీ నేతల ప్రభావంతో టీనేజ్ నుంచే రాజకీయాలవైపు ఆకర్షితుడయ్యారు.
1941: 'తమిళనాడు తమిళ మానవర్ మంద్రం' పేరుతో ఒక విద్యార్థి సంఘాన్ని స్థాపించారు.
1944 సెప్టెంబర్: పద్మావతిని వివాహం చేసుకున్నారు. వారి కొడుకు ఎం.కె.ముత్తు.
1948 సెప్టెంబర్: భార్య పద్మావతి మరణించాక, దయాళు అమ్మాళ్ను వివాహం చేసుకున్నారు. వారి సంతానం.. ఎం.కె.స్టాలిన్, ఎం.కె.తమిళరసి, ఎం.కె.అళగిరి, సెల్వి.
1949 సెప్టెంబర్ 18: పెరియార్ రామస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చాక సి.ఎన్.అన్నాదురై 'ద్రవిడ మున్నేట్ర కజగం'(డీఎంకే) పార్టీని స్థాపించారు.
1950: 'మంత్ర కుమారి' సినిమా విడుదలైంది. ఈ సినిమాకు కరుణానిధి స్క్రిప్ట్ రైటర్. హీరో ఎంజీఆర్ ఆ సినిమాలో కథానాయకుడు.

1952: 'పరాశక్తి' సినిమా విడుదలైంది. ఈ సినిమాతో సినీ రచయితగా కరుణానిధికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ సినిమాతో శివాజీ గణేశన్ హీరోగా పరిచయమయ్యారు.
1953 జూలై 14, 15: 'కుల కల్వి తిట్టమ్'(వారసత్వపు విద్యా పథకం)కు వ్యతిరేకంగా డీఎంకే పార్టీ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. 'దల్మియపురం' అనే ప్రాంతం పేరును 'కల్లక్కుడి'గా మార్చాలన్నది కూడా మరో డిమాండ్. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా కరుణానిధి.. రైలు పట్టాలపై తల పెట్టి నిరసన తెలిపిన ఘటన సంచలనం సృష్టించింది.
1957: కులితలై నియోజకవర్గం నుంచి కరుణానిధి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాను పోటీ చేసిన మొత్తం 13 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరుణానిధి గెలిచారు.
1959: చెన్నై(అప్పటి మద్రాసు) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో డీఎంకే పార్టీ గెలిచింది. మొత్తం 100 సీట్లకు గాను.. డీఎంకే పార్టీ 45 సీట్లను కైవసం చేసుకుంది.
1962: తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష ఉపనేత అయ్యారు.
1963: నిరసనల్లో భాగంగా భారత రాజ్యాంగం కాపీలను దహనం చేసిన కేసులో 6నెలలు జైలు శిక్ష విధించారు.
1965 ఫిబ్రవరి 16: 'హిందూ వ్యతిరేక ఉద్యమం' నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయ్యి, ఏప్రిల్ 15న విడుదలయ్యారు.
1967: శాసనసభ ఎన్నికల్లో డీఎంకే గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 'ప్రజా పనుల శాఖ' మంత్రి అయ్యారు.
1969 ఫిబ్రవరి 10: అన్నాదురై మరణం తర్వాత కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
1969 జూలై 27: డీఎంకే పార్టీ అధ్యక్షుడు అయ్యారు.
1971 మార్చి 15: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ మళ్లీ విజయం సాధించింది. కరుణానిధి రెండోసారి మఖ్యమంత్రి అయ్యారు.
1972 అక్టోబర్ 14: ఎం.జి.రామచంద్రన్ డీఎంకేతో విభేదించి, డీఎంకే నుంచి బయటికొచ్చారు. తర్వాత 'ఏఐఏడీఎంకే' పార్టీ స్థాపించారు.
1974 ఆగస్టు 15: కరుణానిధి విన్నపం మేరకు.. పంద్రాగస్టునాడు జాతీయ జెండా ఎగరవేసే అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రులకు దక్కింది.
1976 జనవరి 31: డీఎంకే ప్రభుత్వం బర్తరఫ్ అయ్యింది.
1986: శ్రీలంక తమిళుల అంశంలో కరుణానిధి.. టీఈఎస్ఓ (తమిళ్ ఈలం మద్దతుదారుల సంఘం) సమావేశం నిర్వహించారు.
1988: వి.పి.సింగ్ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పాటైన 'నేషనల్ ఫ్రంట్' ప్రభుత్వంలో డీఎంకే పార్టీ భాగస్వామి అయ్యింది.

1989: ఎంజీఆర్ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎంకే గెలిచింది. కరుణానిధి మూడవసారి ముఖ్యమంత్రి అయ్యారు.
1991 జనవరి 30: శాంతి భద్రతల అంశం కారణంగా డీఎంకే ప్రభుత్వం మరోసారి బర్తరఫ్ అయ్యింది.
1996: నాలుగోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి ప్రమాణ స్వీకారం చేశారు.
2001 జూన్ 30: 2001 ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయింది. జయలలిత ప్రభుత్వం కరుణానిధిని అర్ధరాత్రి పూట అరెస్టు చేసింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
2006: ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించింది. కరుణానిధి ఐదోసారి మఖ్యమంత్రి అయ్యారు.
2008-09: శ్రీలంకలోని తమిళుల పట్ల నిర్లక్ష్యం వహించారని, శ్రీలంక బలగాలు, ఎల్.టి.టి.ఇ మధ్య జరుగుతున్న యుద్ధంలో కాస్త విరామం కలిగించే దిశగా.. భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారని కరుణానిధిపై విమర్శలు వచ్చాయి.
2010: తమిళనాడు కొత్త సచివాలయాన్ని ప్రారంభించారు.
2010 జూన్: కరుణానిధి ప్రభుత్వం కోయంబత్తూరులో 'ప్రపంచ తమిళ క్లాసికల్ కాన్ఫరెన్స్'కు ఆతిథ్యం ఇచ్చింది.
2011: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే చేతిలో డీఎంకే ఓటమిపాలైంది.
2013: కొడుకు స్టాలిన్ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు.
2014-16: 2014లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయింది.
2016 అక్టోబర్ 25: కురుణానిధి ఆరోగ్యం దెబ్బతిందని డీఎంకే ప్రకటించింది.
2016 డిసెంబర్ 01: చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో వైద్యం కోసం కరుణానిధిని చేర్చారు. డిసెంబర్ 07న కరుణానిధి డిశ్చార్జ్ అయ్యారు.

2017 డిసెంబర్ 15: శ్వాసకోశ సమస్యతో రెండోసారి కరుణానిధిని హాస్పిటల్లో చేర్చారు. ఆయనకు 'ట్రాకియోస్టొమీ' ఆపరేషన్ చేశారు.
2017 డిసెంబర్ 16: డీఎంకే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి కరుణానిధి వచ్చారు. అప్పటికి ఆయన కార్యాలయానికి వచ్చి సంవత్సరం గడిచింది.
2018 జూలై 18: అర్ధరాత్రి దాటాక, బీపీ స్థాయి తగ్గిపోయిన కారణంగా ఆయన్ను కావేరీ హాస్పిటల్ ఐసీయూలో చేర్చారు.
2018 ఆగస్టు 07: కరుణానిధి మరణించినట్లు కావేరీ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి
- కరుణానిధి: సీఎంలకు పంద్రాగస్టున జెండా ఎగరేసే హక్కు ఈయన వల్లే దక్కింది
- గూగుల్లో ఉద్యోగం వదిలేశాడు.. అమ్మతో కలిసి హోటల్ పెట్టాడు
- BBC SPECIAL: ‘దేశంలో అతిపెద్ద మారణకాండను నేను ఆరోజే చూశాను’
- అమీనా: ఈ ఆఫ్రికా రాణి ప్రతి యుద్ధం తరువాత ఓ భర్తను పొందుతారు తర్వాత..
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.








