21 ఏళ్లకే పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన యువతి.. ఈ యంగెస్ట్ సర్పంచ్ లక్ష్యం ఏంటో తెలుసా?

వీడియో క్యాప్షన్, 21 ఏళ్లకే పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన యువతి.. ఈ యంగెస్ట్ సర్పంచ్ లక్ష్యం ఏంటో తెలుసా?
21 ఏళ్లకే పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన యువతి.. ఈ యంగెస్ట్ సర్పంచ్ లక్ష్యం ఏంటో తెలుసా?

21ఏళ్ల అంజూ తన్వర్ హరియాణాలో అతితక్కువ వయసుగల సర్పంచ్.

హేంద్రగఢ్‌లోని ఖుదనా గ్రామానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇక్కడ నవంబరు 2న పంచాయతీ ఎన్నికలు జరిగాయి.

ఈ పంచాయతీని మహిళల కోసం రిజర్వు చేశారు. ప్రచార సమయంలో గ్రామ అభివృద్ధి గురించి అంజు మాట్లాడేవారు.

బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ స్టడీస్ అండ్ మెడిసిన్ అంటే బీఏఎంఎస్‌ మొదటి సంవత్సరం అంజు చదువుతున్నారు.

గ్రామ పెద్దల సాయంతో సర్పంచ్ పనులు చూసుకుంటూ తాను చదువుకోగలనని ఆమె చెబుతున్నారు.

248 ఓట్ల మెజారిటీతో అంజు ఎన్నికల్లో గెలిచారు. ఆమెకు మొత్తంగా 1300 ఓట్లు వచ్చాయి. ఆమె ప్రత్యర్థికి 1052 ఓట్లు వచ్చాయి.

అంజు తండ్రి డాక్టర్. ఈ విజయం కోసం అంజు చాలా కష్టపడ్డారని ఆయన అన్నారు. గ్రామానికి సర్పంచ్‌గా తను ఎలా పనిచేస్తుందోనని అంతా ఎదురుచూస్తున్నామని ఆయన వివరించారు.

21ఏళ్ల అంజూ తన్వర్ హరియాణాలో అతితక్కువ వయసుగల సర్పంచ్
ఫొటో క్యాప్షన్, 21ఏళ్ల అంజూ తన్వర్ హరియాణాలో అతితక్కువ వయసుగల సర్పంచ్. ఆమె గ్లాసు గుర్తుపై పోటీ చేసి గెలిచారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)