ఆంధ్రప్రదేశ్: మడ అడవుల్లో ప్రయాణం ఎలా ఉంటుందంటే..

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని కాపాడుతున్న మడ అడవుల్లో ప్రయాణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే..
ఆంధ్రప్రదేశ్: మడ అడవుల్లో ప్రయాణం ఎలా ఉంటుందంటే..

ఇవి మడ అడవులు. నదులు సముద్రంలో కలిసే చోట, తీరప్రాంతంలో ఇవి సహజసిద్ధంగా పెరుగుతాయి.

పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే మడ అడవులు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి.

మడ అడవుల మధ్య ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏపీలోని కేజీ బేసిన్‌లో ఇవి ఉన్నాయి. కృష్ణా, బాపట్ల జిల్లాల పరిధిలో 5 వేల హెక్టార్ల వరకూ ఈ అడవులు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడ తెల్లమడ, నల్లమడ, పొన్న, దుడ్డుపొన్న వంటి రకాల మొక్కలున్నాయి.

మడ అడవులు

నీళ్లలో వేర్లు, మొదళ్లు కనిపిస్తూ, పైన పచ్చని మొక్కలతో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి మడ అడవులు. ఇవి పలు జీవులకు ఆవాసంగా ఉంటాయి. అదే సమయంలో మత్స్యకారుల చేపల వేటకు కూడా ఇవి ఆధారంగా ఉన్నాయి.

బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం కొత్తపాలెం ప్రాంతంలో మడ అడవుల నుంచి సముద్రం మధ్యలో ఉండే పాయ వరకూ వెళ్లి చేపలు పడుతుంటారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)