లఖ్నవూ: ఇక్కడి కబాబ్, బిర్యానీ వంటకాలపై అధికారుల ఆంక్షలు ఎందుకు?
లఖ్నవూ: ఇక్కడి కబాబ్, బిర్యానీ వంటకాలపై అధికారుల ఆంక్షలు ఎందుకు?
ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూ నగరం తన సంస్కృతి, వారసత్వంతోపాటూ రుచికరమైన కబాబ్స్, బిరియానీలకు కూడా ప్రసిద్ధి.
ఈ వంటకాలను బొగ్గులపై వండుతారు.
పర్యావరణ పరిరక్షణ కోసం స్థానిక యంత్రాంగం ఈ వంటకాలను ఇక మీదట బొగ్గులకు బదులు గ్యాస్ మీద తయారుచేయాలని సూచించింది.
దీంతో తందూరీ పొయ్యిలు, బొగ్గులపై వీటిని తయారు చేయడం వల్ల వాటికి వచ్చే ఆ రుచి, పరిమళం గ్యాస్ మీద చేయడం వల్ల రాదేమోనని స్థానిక రెస్టారెంట్ యజమానులు అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









