శిలువ వేయడం ఎప్పుడు మొదలైంది? ఈ శిక్షఎంత క్రూరంగా ఉండేది?
శిలువపై మరణించిన వారిలో ఏసు క్రీస్తు ప్రముఖులు. ఆయన జననం కంటే కొన్ని శతాబ్దాల ముందు కూడా ఈ దారుణ శిక్ష అమలులో ఉండేది. ఈ శిక్ష అమలు తీరు చాలా క్రూరంగా ఉండేది. ఈ శిక్షతో భరించలేని నొప్పి వస్తుంది. మొదట చాలా రక్తం పోతుంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. చాలా కేసుల్లో మరణం చాలా నెమ్మదిగా వస్తుంది.
''ప్రాచీన కాలంలో అత్యంత దారుణమైన మూడు మరణ శిక్షల్లో శిలువ వేయడం మొదటిది. బతికుండగానే నిప్పు పెట్టడం, తల నరికేయడం ఆ తర్వాతి స్థానాల్లో ఉంటాయి''అని దక్షిణాఫ్రికాలోని ఫ్రీస్టేట్ యూనివర్సిటీ పరిశోధకురాలు, రచయిత లూసీ సిలీర్స్ చెప్పారు.
''క్రూరత్వానికి ఇది ప్రతీక. అంతేకాదు చూసేవారిలోనూ ఇది భయాన్ని పుట్టిస్తుంది'' అని స్పెయిన్లోని నవరా యూనివర్సిటీ థియోలజీ ప్రొఫెసర్ డీగో పెరేజ్ గోడార్ వ్యాఖ్యానించారు.
శిలువ వేయడం పశ్చిమ ఆసియాలోని అస్సిరియా, బాబిలోనియా నాగరికతల్లో పుట్టి ఉండొచ్చని సిలీర్స్ చెప్పారు. ''క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో పర్షియాలో శిలువ వేయడం ద్వారా మరణ శిక్ష విధించినట్లు చరిత్ర చెబుతోంది'' అని ఆమె వివరించారు. ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ - రింకూ సింగ్: కోచింగ్ సెంటర్లో గదులు తుడిచే పని నుంచి క్రికెట్ స్టార్ దాకా...
- మెక్సికోలో కాథలిక్ మత బోధకులను ఎందుకు చంపేస్తున్నారు?
- కేథలిక్ చర్చి ఫాదర్లు ఇక పెళ్లి చేసుకోవచ్చా? బ్రహ్మచర్యంపై పోప్ ఫ్రాన్సిస్ మాటలు ఏం చెబుతున్నాయి?
- తిరుమలలో అన్యమతస్తుల ప్రవేశానికి ‘డిక్లరేషన్’ నిబంధన ఎప్పుడు, ఎలా మారింది? మార్చే అధికారం ఎవరిది?
- మత మార్పిడి: రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను ఎందుకు తీసుకొస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)