You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టోక్యో ఒలింపిక్స్ విజేతలకు ఇచ్చిన బొకేల కథేంటో తెలుసా
ఒలింపిక్స్లాంటి విశ్వ క్రీడల్లో గెలుపొందడం ఏ ఆటగాడికైనా ఓ మరుపురాని అనుభూతి.
అలాంటి మధురమైన క్షణాల్లో విజేతలకు పతకాలతో పాటు బొకేలు అందిస్తుంటారు.
టోక్యో ఒలింపిక్స్లో విజేతలకు అందించిన బొకేలకు ఒక ప్రాముఖ్యత ఉంది.
భారీ విపత్తు సంభవించిన ప్రాంతాల్లో వికసించిన పూలతో ఈ బొకేలను తయారు చేశారు.
ఒలింపిక్, పారాలింపిక్ క్రీడల్లో 5,000 కంటే ఎక్కువ బొకేలు అథ్లెట్లకు అందజేశారు.
2011లో భూకంపం, సునామీ ఆ తర్వాత ఫుకుషిమా అణు కేంద్రంలోని మూడు రియాక్టర్లు కరిగిపోవడంతో జపాన్ తీవ్రంగా నష్టపోయింది.
ఇవాటే, ఫుకుషిమా, మియాగి ప్రాంతాలలో సంభవించిన విపత్తులో దాదాపు 20వేల మంది మరణించారు.
బొకేల్లో ఉపయోగించిన పూలను ప్రధానంగా ఈ మూడు ప్రాంతాల్లోనే సాగు చేశారు. ఒలింపిక్స్, పారాలింపిక్స్ రెండింటిలోనూ పతక విజేతలకు ఇచ్చిన బొకేల్లో వాడిన పసుపు, ఆకుపచ్చ, నీలం రంగు పూలను ఈ మూడు ప్రాంతాల్లోనే సాగు చేశారు.
బొకేల్లో వాడిన ప్రకాశవంతమైన పసుపురంగులోని పొద్దుతిరుగుడు మొక్కలను మియాగిలో పెంచారు.
విపత్తులో మరణించిన వారి తల్లిదండ్రులతో ఈ మొక్కలను నాటించారు.
సునామీ బారి నుంచి పిల్లలను కాపాడిన కొండను ఈ మొక్కలు నాటడానికి ఎంచుకున్నారు.తెలుపు, ఊదా రంగులోని పుష్పాలనిచ్చే యూస్టోమాలు, సోలమన్ సీల్స్లు ఫుకుషిమాలో పెరిగాయి.
నాటి విపత్తు వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపించింది.
జెంటియన్స్ ఒక చిన్న ప్రకాశవంతమైన నీలం పువ్వు. 2011 విపత్తులో ధ్వంసమైన తీర ప్రాంతం ఇవాటేలో ఈ పూలను సాగు చేశారు. ఇక పూల బొకేకు తొడుగుగా వాడే ఆకుపచ్చ ఆస్పిడిస్ట్రాలను మాత్రం ఒలింపిక్స్కు ప్రాతినిధ్యం వహించిన టోక్యో నగరానికి సూచికగా ఇక్కడ పెంచారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)