డిప్రెషన్లో ఉన్నారా.. అయితే, వేడినీళ్లతో స్నానం చేయండి

ఫొటో సోర్స్, Getty Images
ఎక్కువగా కనిపించే మానసిక సమస్యల్లో కుంగుబాటు(డిప్రెషన్)దే మొదటి స్థానం. వేడినీటి స్నానం ఆ సమస్యకు చక్కని పరిష్కారం అని అధ్యయనాలు చెబుతున్నాయి.
కుంగుబాటుతో బాధపడేవాళ్లు తరచూ వేడి నీటితో స్నానం చేయాలని, దాని వల్ల మూడ్ పూర్తిగా మారిపోతుందని జర్మనీకి చెందిన ఫ్రీబర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
రోజు మొత్తంలో మన శారీరక, జీవరసాయన మార్పులు అలల రూపంలో జరుగుతుంటాయి. దాన్ని సిర్కేడియన్ రిథమ్ అంటారు. కుంగుబాటుతో బాధపడేవాళ్లలో ఈ క్రమం దెబ్బతింటుంది. ఈ రిథమ్పై వేడి నీళ్లు సానుకూల ప్రభావం చూపుతాయి.
మధ్యాహ్నం పూట వేడినీటితో స్నానం చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రత పెరిగి ఆ రిథమ్ నియంత్రణలోకి వస్తుంది. కనీసం ఓ అరగంటపాటు అలా నీళ్ల కింద కూర్చోవాలని అధ్యయనకర్తలు సూచిస్తున్నారు. దీనివల్ల నిద్ర కూడా బాగా పడుతుందని చెబుతున్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఇప్పటిదాకా డిప్రెషన్కు మూలకారణాలేంటో పరిశోధకులు కనిపెట్టలేకపోయారు. మానసిక చికిత్స, వ్యాయామం, యాంటీ డిప్రెసెంట్ల సాయంతో వైద్యులు దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు.
వ్యాయామంతో పోలిస్తే వేడినీటి స్నానం మెరుగైన ఫలితాలనిస్తుందని ఈ అధ్యయనం చెబుతోంది. తక్కువ స్థాయి డిప్రెషన్కు ఈ పద్ధతి మరింత అనువైందని అధ్యయనకర్తలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








