ఇండోనేషియా: మొసళ్లపై ప్రతీకారం తీర్చుకున్నారు

ఇండోనేషియాలో ఒక మొసలి స్థానికుణ్ని చంపేసిందన్న కోపంతో గ్రామస్థులు సుమారు 300 మొసళ్లను చంపేశారు.

అక్కడి వెస్ట్ పపువా ప్రావిన్స్‌లో జరిగిన ఈ సంఘటనను అధికారులు కానీ, పోలీసులు కానీ అడ్డుకోలేకపోయారు.

ఇండోనేషియాలో మొసళ్లను చంపడం నేరం. దీనికి శిక్షగా జరిమానా లేదా జైలుశిక్ష విధించొచ్చు.

శుక్రవారం ఉదయం స్థానికుడొకరు ఓ మొసళ్ల సంరక్షణ కేంద్రం వద్ద కూరగాయలు కోసుకుంటుండగా, ఓ మొసలి దాడి చేసి అయన్ను చంపేసింది.

శనివారం అతని అంత్యక్రియల అనంతరం కొన్ని వందల మంది స్థానికులు కత్తులు, ఇతర మారణాయుధాలతో ఆ మొసళ్ల సంరక్షణ కేంద్రానికి వెళ్లారు.

మొదట ఆ కేంద్రం కార్యాలయంపై దాడి చేశారు. ఆ తర్వాత అక్కడ పెంచుతున్న సుమారు 300 మొసళ్లను చంపేశారు.

ఈ కేంద్రంలో ఉప్పునీటి, న్యూ గినియా జాతికి చెందిన మొసళ్లను సంరక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)