గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ 'భారీ' దాడి

ఫొటో సోర్స్, AFP
గాజాలోని హమాస్ మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా భారీ వైమానిక దాడి చేసినట్టు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇది 2014 గాజా యుద్ధం తర్వాత తాము జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని ఆయన అన్నారు.
తమ భూభాగంపై జరిగిన రాకెట్ల దాడులకు ప్రతిస్పందనగా ఈ వైమానిక దాడి జరిపినట్టు నెతన్యాహు వెల్లడించారు. అవసరమైతే మరిన్ని దాడులకూ వెనకాడబోమని అన్నారు.
అయితే.. పాలస్తీనా మాత్రం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉందని చెబుతోంది.
తాజా దాడుల వల్ల గాజా నగరంలో ఇద్దరు మరణించగా.. మరో 12 మంది గాయడినట్టు పాలస్తీనా వెల్లడించింది.
అంతకుముందు ఇజ్రాయెల్ భూభాగంపై దాదాపు 90 రాకెట్లు దాడి చేయగా.. ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు.
గాజాలోని హమాస్ మిలిటెంట్ సంస్థ వినియోగిస్తున్న బెటాలియన్ హెడ్క్వార్టర్.. మిలిటెంట్ శిక్షణా కేంద్రం ఉన్న భారీ భవనం.. ఆయుధాగారం సహా పలు స్థావరాలపై తమ యుద్ధ విమానాలు దాడులు చేశాయని ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్) వెల్లడించాయి.
ఈ దాడులకు సంబంధించినవిగా చెబుతూ రెండు వీడియోలను ఐడీఎఫ్ ట్విటర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గాజా నగరంలోని ఓ ఖాళీ భవనం మీద ఇజ్రాయెల్ దాడి చేసిందని, ఆ భవనం పక్కన వెళ్తున్న పాదచారులు ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు రాయిటర్ వార్తా సంస్థకు తెలిపారు.
శుక్రవారం పాలస్తీనా, ఇజ్రాయెల్ సరిహద్దు వద్ద ఆందోళనల సమయంలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో ఒక పాలస్తీనా పౌరుడు చనిపోయాడని హమాస్ పేర్కొంది.
మరోవైపు.. తమ ప్రాంతం మీద పాలస్తీనా డజన్ల కొద్దీ రాకెట్లతో దాడులు చేసిందని ఇజ్రాయెల్ అంటోంది.
గత కొన్ని నెలలుగా పాలస్తీనా, ఇజ్రాయెల్ సరిహద్దులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.
ఇజ్రాయెల్లోని తమ పూర్వ స్వస్థలాలకు వెళ్లేందుకు తమను అనుమతించాలంటూ పాలస్తీనాలోని వేలాది మంది సరిహద్దు వద్ద ఆందోళనలు చేస్తున్నారు.
అలాగే.. గాజాపై ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాలు విధించిన నిషేధాజ్ఞలను, సరిహద్దుల మూసివేతను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కానీ.. తీవ్రవాదులను కట్టడి చేసేందుకు దిగ్బంధమే సరైన మార్గమని ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాలు అంటున్నాయి.
సరిహద్దు వద్ద ఆందోళనల సమయంలో ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో 130 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోగా.. మరో 15,000 మంది గాయపడ్డారని గాజా వైద్య శాఖ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- వీళ్లు స్మార్ట్ రైతులు.. యాప్స్తో లాభాలు పండిస్తున్నారు
- ఉత్తరప్రదేశ్ మహిళలకు పాలమూరు వనితల పాఠాలు
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- సోషల్: అద్దె ఇంటికి ఎవరైనా అద్దె కట్టాల్సిందే కదా, మరి కులం అడగడం ఎందుకు?
- ప్రపంచం నుంచి చీకటిని మానస తరిమేయాలనుకుంటోంది. ఇలా..
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు : బీబీసీ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్
- హాలీవుడ్ సినిమాల రేంజ్లో జైళ్ల నుంచి తప్పించుకున్నారు వీళ్లంతా
- అమెరికా-బ్రిటన్ చారిత్రక సంబంధాలకు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలుకుతారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)










