అనంతపురం: గాడిదలకు పరుగు పందెం
అనంతపురం జిల్లా వజ్రకరూర్లో జనార్దన వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా గాడిదల పరుగు పోటీని నిర్వహించారు.
గాడిదలపై వాటి యజమానులు కూర్చొని సవారీ చేసి లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ పోటీలో గుర్రాలకు తామేమీ తీసిపోమంటూ పరుగులు తీశాయి గాడిదలు.
ఈ పోటీలను క్రీడామైదానంలో కాకుండా రోడ్డుపై నిర్వహించారు. వజ్రకరూరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి వజ్రకరూరుకు వచ్చే విధంగా మొత్తం 18 కిలోమీటర్ల దూరం ఈ గాడిదల రన్నింగ్ రేస్ నిర్వహించారు.
ఈ రేసులో చివరకు మూడు గాడిదలు మాత్రమే మిగిలాయి. ప్రతీ సంవత్సరం ఈ పోటీలను నిర్వహిస్తున్నామని, కరోనా కారణంగా గత రెండేళ్లు నిర్వహించలేక పోయామని నిర్వాహకులు రాఘవ, రమణలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- చైనా చివరి చక్రవర్తి తోటమాలిగా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది?
- ఒకే వ్యక్తికి మూడు వయసులు - కొరియాలో పుడితే అంతే
- హైదరాబాద్: ‘గుడికి వచ్చిన భక్తురాలిని రాడ్డుతో కొట్టి చంపిన పూజారి.. శవం వాసన రాకుండా అగరబత్తుల ధూపం వేశాడు’
- ఈ నిధి ఎవరి దగ్గరుంటే వారికి భవిష్యత్తులో తిరుగుండదు
- శ్రీలంకలో ‘ఆర్యులు రావటానికి ముందునుంచీ ఉన్న తొట్టతొలి ఆదివాసీ ప్రజల్లో‘ మిగిలిన చిట్టచివరి జనం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)