సికింద్రాబాద్‌లో 18వ శతాబ్ధం మెట్లబావి.. 22 లక్షల లీటర్ల నీరు నిల్వ చేయొచ్చు

వీడియో క్యాప్షన్, సికింద్రాబాద్‌లో 18వ శతాబ్ధం మెట్లబావి.. 22 లక్షల లీటర్ల నీరు నిల్వ చేయొచ్చు

సికింద్రాబాద్‌లోని ఈ బన్సీలాల్‌పేట్ మెట్ల బావిని 18వ శతాబ్దంలో నిర్మించారు.

53 అడుగుల లోతున్న ఈ బావిలో చుట్టూ నడిచేందుకు మండపం, అట్టడుగుకు వెళ్లే వరకూ మెట్లు ఉన్నాయి.

ఈ బావిలో 22 లక్షల లీటర్ల నీరు నిల్వ చేసుకోవచ్చు.

1970 లవరకూ వాడకంలో ఉన్న ఈ బావి ఆ తర్వాత నిర్లక్ష్యానికి గురయ్యింది. ఇందులో 2 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది.

దీనిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇలాంటివి హైదరాబాద్ పరిధిలో 25 వరకూ ఉన్నాయని, వీటిలో 6 బావుల పునరుద్ధరణ పనులు ఇప్పటికే ప్రారంభించామని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)