పీఎం కేర్స్ ఫండ్‌: కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు ఉచిత విద్య

కోవిడ్-19తో తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తుందని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) శనివారం ప్రకటించింది.

ఆ పిల్లల ఉన్నత విద్యకు విద్యా రుణాలు మంజూరు చేస్తామని, దీని వడ్డీ పీఎం కేర్స్ ఫండ్ చెల్లిస్తుందని తెలిపింది.

మరోవైపు ఈ పిల్లలకు 18ఏళ్లు దాటిన తర్వాత నెలనెలా స్టైఫండ్‌ను కూడా అందిస్తామని, 23ఏళ్లు వచ్చాక పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ.10 లక్షలు ఇస్తామని పేర్కొంది.

కరోనావైరస్ సోకడంతో ఇద్దరు తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన పిల్లల వివరాలను ఆన్‌లైన్ ట్రాకింగ్ పోర్టల్ ‘‘బాల్ స్వరాజ్’’లో నమోదు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బాలల హక్కుల జాతీయ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) సూచించింది.

తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య, భృతి సహా పలు సదుపాయాలను కల్పిస్తున్నట్లు దిల్లీ, కేరళ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)