కరోనావైరస్: ఇప్పటివరకూ ఏయే రాష్ట్రాలు ఏం చేశాయి?

భారత్‌లో కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకూ తొమ్మిది మంది చనిపోయారు. 424 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ధ్రువీకరించారు. భారత్‌లో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.

మహారాష్ట్రలో ఇప్పటివరకూ 69, కేరళలో 60, రాజధాని దిల్లీలో 28, ఉత్తరప్రదేశ్ 27, కర్నాటకలో 26 కేసులు బయటపడ్డాయి. రైల్వే మంత్రిత్వ శాఖ గూడ్స్ రైళ్లు మినహా ప్రయాణికుల రైళ్లన్నీ నిలిపివేయాలని ఆదేశించింది.

అన్ని మెట్రో సేవలు, అంతర్‌రాష్ట్ర బస్సు సేవలను కూడా నిలిపివేశారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డ 75 జిల్లాలను మార్చి 31 వరకూ లాక్‌డౌన్ చేశారు.

పాజిటివ్ రోగుల సంఖ్య పెరగడంతో కరోనావైరస్ వ్యాపించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాయి.

దిల్లీ ప్రభుత్వం ఏం చేస్తోంది ?

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కొన్ని కీలక ప్రకటనలు చేశారు.

1. దిల్లీ ఎన్‌సీఆర్‌లో మార్చి 23 ఉదయం 6 గంటల నుంచి మార్చి 31 అర్థరాత్రి వరకూ పూర్తిగా లాక్‌డౌన్ చేస్తారు.

2. రైళ్ల రాకపోకలు, విమానాశ్రయాలు, ప్రైవేట్ బస్సులు, వాహనాలను కూడా నిలిపివేస్తారు.

3. డీటీసీ బస్సులు 50 శాతమే నడుపుతారు. వీటిని కూడా అత్యవసర సేవల్లో పాల్గొంటున్న వారు మాత్రమే వినియోగించుకోవాలని కేజ్రీవాల్ సూచించారు.

4. అన్ని నిర్మాణ పనుల్ని నిలిపివేస్తారు.

5. అవసరమైన వస్తువులు, సరుకులు మినహా అన్ని మార్కెట్లు, దుకాణాలు, పరిశ్రమల మూసివేత.

6. సెక్షన్ 144 అమలు.

7. దిల్లీలోని 72 లక్షల మంది పేదలకు 7.5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు.

8. దిల్లీలోని 8.5 లక్షల మందికి నాలుగు నుంచి ఐదు వేల రూపాయల పెన్షన్ అందిస్తారు.

9. దిల్లీ ప్రభుత్వం నైట్ షెల్టర్లలో ఉచిత భోజన ఏర్పాట్లు ప్రారంభించింది. ఎవరైనా అక్కడకు వెళ్లి భోజనం చేయవచ్చు.

10. ఇళ్లలో ఉండే వారికి పెయిడ్ లీవులు ఇవ్వాలని కూడా దిల్లీ ప్రభుత్వం కోరింది.

11. క్వారంటైన్‌లో ఉండాలని కోరిన వ్యక్తులు నివసిస్తున్న ఇళ్లను కూడా మార్క్ చేస్తున్నారు.

12. లాక్‌డౌన్ సమయంలో ఏ కార్మికుడి వేతనంలోనూ కోత విధించకూడదని ప్రభుత్వం కోరింది.

13. ఈ సమయంలో దిల్లీ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్, రోజువారీ కార్మికుల పూర్తి వేతనం చెల్లించాలని ముందే నిర్ణయించింది.

14. ప్రభుత్వం తమ తాజా ఆదేశాల్లో ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు కూడా ఇళ్లలోనే ఉండాలని, ఆ సమయంలో సంస్థ వారికి పూర్తి వేతనం అందించాలని చెప్పింది.

15. మార్చి 31 వరకూ అన్ని స్కూళ్లూ మూసివేత.

16. అన్ని మత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలపై నిషేధం.

17. ఒక ప్రాంతంలో 50 మందికి పైగా గుమిగూడకుండా నిషేధం.

18. జామియా, జేఎన్‌యూ విద్యార్థులకు ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశాలు.

19. ఐఐటీ దిల్లీ అన్ని తరగతులనూ రద్దు చేసినట్లు చెప్పింది.

యూపీ సర్కార్ చర్యలు

1. యూపీలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది గుమిగూడకుండా చర్యలు తీసుకుంది.

2. జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది. దీని ప్రకారం మొదటి దశలో 15 జిల్లాల్లో పూర్తిగా లాక్‌డౌన్ చేస్తారు.

3. ఈ 15 జిల్లాల్లో లాక్‌డౌన్ సమయంలో పెట్రోలింగ్ ఉంటుంది.

4. ఈ జిల్లాల్లో ఎలాంటి కార్యకలాపాలూ ఉండవు. మార్చి 23 నుంచి 25 వరకూ ఇది కొనసాగుతుంది.

5. ప్రజలకు సాయం అందించడానికి రాష్ట్ర పోలీసు వాహనాలను ఉపయోగిస్తారు. అవసరమైన సరుకులను అందిస్తారు.

6. కరోనా పాజిటివ్ వచ్చినవారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తోంది.

7. ఆరోగ్య సేవలకు 108 అంబులెన్సులు, 102 అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి.

8. రాష్ట్రవ్యాప్తంగా ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించడానికి 250 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు కూడా ఏర్పాటు చేశారు.

9. ఉపాధి హామీ కూలీలు, అంత్యోదయ కార్డుదారులకు, పేదలకు రిలీఫ్ ప్యాకేజీలను ప్రభుత్వం ముందే ప్రకటించింది.

10. తదుపరి ఆదేశాల వరకూ సినిమ హాళ్లు, మల్టీ ప్లెక్సులు మూసివేయాలని నోటీసులు

11. అన్ని పర్యటక ప్రాంతాలను, మ్యూజియంలను మార్చి 31 వరకూ మూసివేయాలని ఆదేశం.

12. ఏప్రిల్ 2 వరకూ అన్ని విద్యాసంస్థల మూసివేత.

13. ఉద్యోగులు వీలైనంత వరకూ ఇళ్ల నుంచే పనిచేయాలని ఆదేశాలు.

14. రోజు కూలీలకు కుటుంబ పోషణ కోసం ఒక నిర్ధారిత మొత్తాన్ని అందిస్తారు.

15. ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు.

16. రాష్ట్రంలో కరోనావైరస్ బాధితుల చికిత్స కోసం అయ్యే మొత్తం ఖర్చును యూపీ సర్కారు భరిస్తుంది.

17. ఒకటి నుంచి 8వ తరగతి వరకూ విద్యార్థులను పరీక్షలు లేకుండానే తర్వాత తరగతులకు పంపిస్తారు.

18. నోయిడా, గ్రేటర్ నోయిడాలో స్విమ్మింగ్ పూల్స్ మూసివేత, బహిరంగ కార్యక్రమాలు, మత, రాజకీయ సమావేశాలు ఏప్రిల్ 15 వరకూ నిషేధం.

మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ?

మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం సినిమా హాళ్లు, జిమ్, పార్కులు మూసివేయడానికి చర్యలు చేపట్టింది.

1. మహారాష్ట్ర అంతటా లాక్‌డౌన్ ఆదేశాలు. రాష్ట్ర సరిహద్దులు, అన్ని జిల్లాల సరిహద్దులు మూసివేత.

2. రైళ్లు, ప్రైవేటు వాహనాలు, రాష్ట్ర రవాణా రద్దు.

3. సిటీ బస్సులు అత్యవసర రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల కోసమే నడుస్తాయి.

4. ఆహార పదార్థాలు, కూరగాయలు, మందులు, నిత్యావసరాల దుకాణాలు తెరిచి ఉంటాయి.

5. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తెరిచి ఉంటాయి.

6. ప్రభుత్వ కార్యాలయాలు 5 శాతం ఉద్యోగులతోనే పనిచేస్తాయి.

7. కరోనావైరస్ టెస్టింగ్, చికిత్స కోసం సెంటర్ల సంఖ్యను పెంచుతున్నారు.

8. ముంబయి, పుణె, నాగపూర్ సహా మహారాష్ట్రలోని అన్ని నగరాల్లో 144 సెక్షన్ అమలు

9. మహారాష్ట్రలో 9వ తరగతి వరకూ పరీక్షల వాయిదా, 10, 12 పరీక్షలు కొనసాగుతాయి.

10. నాగపూర్‌లో మార్చి 31 వరకూ అన్ని పార్కులూ మూసివేత.

11. అన్ని టైగర్ రిజర్వులు, శాంక్చురీలు, నేషనల్ పార్కులు మార్చి 31 వరకూ మూసివేయాలని ఆదేశం.

12. ఐఐటీ బాంబే విద్యార్థులు క్యాంపస్ ఖాళీ చేయాలని ఆదేశాలు.

13. షాపింగ్ మాళ్లు, సినిమా హాళ్లు మార్చి 31 వరకూ మూసివేత.

రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు

రాజస్థాన్ హైకోర్ట్ జైపూర్, జోధ్‌పూర్ కోటా స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేసింది. రాష్ట్రంలో మార్చి 31 వరకూ లాక్‌డౌన్ ఆదేశాలు జారీ చేశారు.

1. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా మార్చి 22 నుంచి మార్చి 31 వరకూ పూర్తిగా లాక్‌డౌన్ ఉంటుంది.

2. పేదలకు మే నెల వరకూ ఉచితంగా గోధుమల పంపిణీ.

3. నగరాల్లో వీధి వ్యాపారులు, రోజు కూలీల కుటుంబాలకు ఏప్రిల్ 1 నుంచి రెండు నెలల వరకు ఉచితంగా నిత్యావసరాల ప్యాకెట్.

4. అత్యవసర సేవల మినహా ప్రైవేటు ఆఫీసులు, మాల్స్, షాపులు, ఫ్యాక్టరీలు, ప్రజా రవాణా మూసివేస్తారు.

5. అన్ని స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు, థియేటర్లు మార్చి 30 వరకూ మూసేయాలని ఆదేశం.

ఛత్తీస్ గఢ్‌లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ఛత్తీస్‌గఢ్‌లోని నగరాల్లో మార్చి 31 వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఈ సమయంలో అన్ని కార్యాలయాలు, రవాణా సేవలు, మిగతా కార్యకలాపాలు రద్దు చేస్తారు.

1. అత్యవసర సేవలు, మెడికల్ షాపులు, కిరాణా షాపులు, జనరల్ స్టోర్స్, కూరగాయలు, పాలు, పెట్రోల్ పంపులు లాంటివి తెరిచి ఉంచుతారు.

2. కరెంట్, నీటి సరఫరా, వంట గ్యాస్ సరఫరా, పరిశుభ్రత సేవలు, నిత్యాసరాలు, కమర్షియల్ గూడ్స్ రవాణా సేవలు కొనసాగుతాయి.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏం చేస్తోంది ?

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా సహా 23 జిల్లాల్లో మార్చి 23 సాయంత్రం 5 గంటల నుంచి మార్చి 27 అర్థరాత్రి వరకూ లాక్‌డౌన్ ఆదేశాలు

1. అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయి.

2. రేషన్, కూరగాయలు, మందుల షాపులు తెరిచి ఉంచుతారు.

3. అన్ని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు ఏప్రిల్ 15 వరకూ మూసివేత.

4. బోర్డ్ పరీక్షలు నిర్వహిస్తారు.

బీహార్ ప్రభుత్వ చర్యలు

బిహార్‌లో ఆదివారం మొదటి కరోనా మృతి కేసు నమోదైంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైరస్ ప్రభావం వ్యాపించకుండా కొన్ని ఆదేశాలు చేశారు.

1. అంతర్‌రాష్ట్ర రవాణా పూర్తిగా నిలిపివేత.

2. విమాన సేవలపై కూడా నిషేధం.

3. జిల్లా హెడ్‌క్వార్టర్స్, నగర పంచాయతీలు అన్నిటిలో లాక్‌డౌన్ అమలు.

4. మృతుల బంధువులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం

5. బస్సులను శుభ్రం చేస్తున్నారు.

6. పట్నా హైకోర్ట్ అత్యవసర కేసుల కోసమే పనిచేస్తుంది.

7. ఎక్కువ ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లను మూసివేశారు.

8. మార్చి 31 వరకూ అన్ని సినిమా హాళ్లు, పబ్లిక్ పార్కులు మూసివేశారు.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏం చేస్తోంది?

1. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్న కూలీల ఖాతాల్లో వెయ్యి రూపాయలు జమచేయాలని నిర్ణయించింది.

2. రాష్ట్రంలో మార్చి 31 వరకూ లాక్‌డౌన్ ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలపై నిషేధం ఉంటుంది.

3. ఆహార, ఆరోగ్య అవసరాలపై పూర్తిగా దృష్టి పెట్టారు.

4. అవసరమైతే ఇంటింటికీ వెళ్లి సరుకులు, మందులు అందిస్తారు.

ఒడిశా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు

కరోనా వ్యాపించకుండా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో ఏడు రోజులు లాక్‌డౌన్ ఆదేశాలు ఇచ్చారు.

1. అన్ని స్కూళ్ల మూసివేతను మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకూ పెంచారు.

2. రాష్ట్రంలోని పర్యాటక స్థలాలు పూరీ బీచ్, కోణార్క్ సూర్య మందిరం, చిలక సరస్సు, చంద్రభాగా బీచ్ మూసివేశారు.

3. 1వ తరగతి నుంచి 9 వరకూ పరీక్షల రద్దు. యూనివర్సిటీల సెమిస్టర్స్ వాయిదా.

4. ఆదేశాలు అమలు చేయనివారిపై ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు

మధ్యప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కరోనా వైరస్ నేపథ్యంలో చాలా నగరాల్లో లాక్‌డౌన్ ఆదేశాలు ఇచ్చారు.

1. భోపాల్, జబల్పూర్‌లో పేద కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా ఈ నెల సరుకులు ఉచితంగా అందిస్తున్నారు.

2. అసెంబ్లీని మార్చి 26 వరకూ వాయిదా వేశారు.

3. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో భక్తులకు ప్రవేశం నిషేధించారు.

జమ్ము కశ్మీర్‌లో పరిస్థితి ఎలా ఉంది ?

1. విదేశీయుల ప్రవేశంపై నిషేధం.

2. రాంబాన్, కిష్త్‌ వాడ్ సహా కొన్ని ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు.

తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు

తమిళనాడులోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేత, ప్రభుత్వ బస్సులు మార్చి 31 వరకూ రద్దు.

1. 10, 12 తరగతుల పరీక్షలు కొనసాగుతాయి.

2. కర్ణాకట, ఆంధ్రప్రదేశ్, కేరళతో సరిహద్దులను సీల్ చేశారు.

3. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ.

4. మతపరమైన ప్రాంతాలకు వెళ్లద్దని వినతి.

5. బహిరంగ కార్యక్రమాలు, కాన్ఫరెన్సులు, అన్ని రకాల సమావేశాలపై నిషేధం.

కేరళ ప్రభుత్వం ఏం చేస్తోంది ?

1. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకూ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డ్ స్కూళ్లు మూత

2. పది, పన్నెండో తరగతి పరీక్షలు కొనసాగుతాయి.

3. ఎనిమిది, తొమ్మిది తరగతుల మిగిలిన పరీక్షలు నిర్వహిస్తారు.

కర్ణాటక ప్రభుత్వం చర్యలు

  • కర్ణాటకలో హోం క్వారంటైన్‌(ఇళ్లలో విడిగా ఉన్నవారు)లో ఉన్న వారి కదలికలను ఫోన్ ద్వారా ట్రాక్ చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.
  • కర్ణాటక మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ సుధాకర్ బుధవారం ఉదయం అసెంబ్లీలో ఈ విషయం చెప్పారు.
  • కొందరు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
  • ఇప్పుడు వైరస్ రెండో దశ నడుస్తోందని, ఇప్పుడే జాగ్రత్త పడకపోతే తర్వాత రెండు, మూడు వారాల్లో ప్రాణాంతకం అవుతుందని చెప్పారు.
  • రాష్ట్రంలో షాపింగ్ మాల్స్, బార్ లాంటి వాటి మూసివేతను ప్రభుత్వం మరో పది రోజులు పొడిగించింది.
  • కోవిడ్-19 నియంత్రణ చర్యల కోసం క్యాబినెట్ 200 కోట్ల రూపాయల సహాయ నిధులు విడుదల చేసింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)