ఏపీ, తెలంగాణ ఎన్నికలు 2019: ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. సీనియర్ నటులు, కొత్త తరం నటులు, దర్శకులు, ఇంకా సినీ రంగానికి చెందిన అనేక మంది ఓటు వేయడానికి క్యూ లైన్లలో వేచి ఉన్నారు.

మంచు మనోజ్, మంచు లక్ష్మి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హిందూపురం అభ్యర్థి, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

విజయవాడలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నటి మాధవీలత, గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి

మోహన్ బాబు, మంచు విష్ణు

సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబ సభ్యులు

సినీ నటుడు చిరంజీవి, ఆయన కుమారుడు హీరో రాంచరణ్, ఇతర కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అమల అక్కినేని

రోజా, నగరి వైసీపీ అభ్యర్థి

నటుడు బ్రహ్మాజీ

పోసాని కృష్ణ మురళి

ఉదయం 8 గంటల నుంచి 9 గంటలు

* సినీ నటుడు అల్లు అర్జున్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

* ఉండవల్లి మండల పరిషత్ పాఠశాలలో బ్రాహ్మణి, లోకేశ్

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పులివెందులలో ఓటు వేశారు.

ఉదయం 7 గంటల నుంచి 8 గంటలు

రాజమండ్రిలో అక్కడి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బాగ్ లింగంపల్లి బూత్ నెంబరు 214 లో బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కిషన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్యతో కలసి ఉదయాన్నే పోలింగ్ స్టేషన్‌కు వచ్చిన ఆయన పోలింగ్ ప్రక్రియ ఆలస్యం కావటంతో దాదాపు 30 నిమిషాలు లైనులో వేచి ఉన్నారు.

విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తున్న అశోక్ గజపతి రాజు, విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన కుమార్తె అదితి ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది తాడేపల్లి క్రిస్టియన్ పేట మున్సిపల్ ప్రాధమిక పాఠశాలలో ఓటు వేశారు.

అమరావతిలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, పులివెందులలో జగన్ కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)