పుల్వామాలో ఎన్‌కౌంటర్: ఇద్దరు మిలిటెంట్లు హతం.. నలుగురు సైనికులు మృతి

పుల్వామాలో సైనికులు, జైష్-ఎ-మొహమ్మద్ మిలిటెంట్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు సైనికులు, ఒక పౌరుడు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఇద్దరు మిలిటెంట్లను కాల్చి చంపినట్లు సైన్యం వెల్లడించింది.

పింగ్లాన్ ప్రాంతంలో జైష్-ఎ-మొహమ్మద్ మిలిటెంట్లు తలదాచుకున్నారన్న సమాచారం అందటంతో సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది సోదాలు జరిపారు.

సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైష్-ఎ-మొహమ్మద్ మిలిటెంట్ల దాడి నేపథ్యంలో.. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలను సైన్యం, సీఆర్పీఎఫ్ ముమ్మరం చేశాయి.

ఈ ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన సైనికుడు గుల్జార్ మొహమ్మద్‌ను ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

మిలిటెంట్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

చనిపోయిన సైనికులు వీరే..

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సైనికులు 55 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన మేజర్ వీఎస్ ధౌండియల్, హవల్దార్ షియో రామ్, సిపాయ్ అజయ్ కుమార్, సిపాయ్ హరి సింగ్‌ అని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)