కేరళ వరదలు: నిండు గర్భిణిని క్షేమంగా ఆస్పత్రికి చేర్చిన నౌకాదళం

వరదల బీభత్సంతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఇప్పటికే 320 మందికి పైగా చనిపోయారు.

వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్‌ఎఫ్), ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

అందుకోసం హెలీకాప్టర్లు, బోట్లు వినియోగిస్తున్నారు.

వరదలో చిక్కుకున్న ఓ గర్భిణిని భారత నావికాదళం హెలీకాప్టర్‌లో వెళ్లి కాపాడింది.

ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను నేవీ ట్విటర్‌లో షేర్ చేసింది.

తర్వాత ఆస్పత్రిలో ఆ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చారు. "తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు" అంటూ ఆస్పత్రిలోని తల్లిబిడ్డల ఫొటోలను నేవీ ట్విటర్‌‌లో పోస్ట్ చేసింది.

ఈ ఆపరేషన్‌లో హెలీకాప్టర్‌ను విజయ్‌ వర్మ అనే పైలట్‌ నడిపారని తెలిపింది.

విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న నిండు గర్భిణిని కాపాడిన భారత నావికా దళాన్ని, ఆ పైలట్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)