You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: 20 రూపాయలకే ‘మన భోజనం’ - ఎక్కడంటే...
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఓ మామూలు హోటల్లో భోజనం చేయాలన్నా సుమారు 100 రూపాయలు ఖర్చవుతుంది.
కానీ ఒక కుటుంబం ‘మన భోజనం’ పేరుతో తక్కువ ధరకే ఆహారం అందిస్తున్నారు.
ఈ భోజనంలో అన్నం, కూర, చట్నీ, సాంబారు, మజ్జిగ కూడా అందిస్తున్నారు.
ఒక్కో భోజనానికి దాదాపు 50 రూపాయలు ఖర్చవుతుందని వారు చెప్పారు. తమకు చేతనైన సేవ చేయాలన్న ఉద్దేశంతో ధర తగ్గించి అందిస్తున్నామని తెలిపారు.
విద్యార్థులతో పాటు వివిధ తరగతుల వారు ఇక్కడ భోజనం చేయటానికి వస్తున్నారు.
ఈ భోజనం ధర చాలా అందుబాటులో ఉండటమే కాకుండా, ఇంటి భోజనం లాగా రుచిగా ఉంటుందని ఇక్కడ భోజనం చేసిన పలువురు విద్యార్థులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచ కుబేరుని కథ: ఎలాన్ మస్క్ను వెనక్కి నెట్టిన బెర్నార్ ఆర్నో ఎవరు
- భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో 7 కిలోమీటర్ల పొడవైన లఖ్పత్ కోట గురించి మీకు తెలుసా?
- అక్కడ చికెన్ కంటే ఎలుక మాంసం ధర ఎక్కువ... దీని రుచి ఎలా ఉంటుంది?
- రిషి రాజ్పోపట్: 2500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యకు.. భారతీయ విద్యార్థి పరిష్కారం
- ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్బాల్ పిచ్ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)