తెలంగాణలో గెలిచేదెవరు... ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు గెలవనున్నారనే ఆసక్తి అంతటా నెలకొంది.

అంతేకాదు, 2024 సాధారణ ఎన్నికలకు ముందు ‘సెమీ ఫైనల్స్’గా చెబుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కడ ఎవరు అధికారంలోకి వస్తున్నారన్నదీ ప్రజల్లో ఆసక్తి ఉంది.

వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవీ:

తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాలలో ముందే పోలింగ్ ముగియగా, తాజాగా గురువారం(30.11.2023) తెలంగాణలోనూ పోలింగ్ ముగిసింది.

ఈ రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నాయంటే...

ఏ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు

తెలంగాణ: మొత్తం 119 నియోజకవర్గాలు. ఇందులో ఎస్సీ రిజర్వ్‌డ్ 19, ఎస్టీ రిజర్వ్‌డ్ 12

రాజస్థాన్: మొత్తం నియోజకవర్గాలు 200, ఇందులో ఎస్సీ రిజర్వ్‌డ్ 25, ఎస్టీ రిజర్వ్‌డ్ 34

మధ్యప్రదేశ్: మొత్తం నియోజకవర్గాలు 230, ఇందులో.. ఎస్సీ రిజర్వ్‌డ్ 35, ఎస్టీ రిజర్వ్‌డ్ 47 నియోజకవర్గాలు

ఛత్తీస్‌గఢ్: మొత్తం నియోజకవర్గాలు 90.. అందులో ఎస్సీ రిజర్వ్‌డ్ 10, ఎస్టీ రిజర్వ్‌డ్ 29 నియోజకవర్గాలు

మిజోరం: మొత్తం నియోజకవర్గాలు 40.. అందులో ఎస్టీ నియోజకవర్గాలు 39 కాగా ఒకటి జనరల్ నియోజకవర్గం. ఈ రాష్ట్రంలో ఎస్టీ నియోజకవర్గాలు లేవు.

ఎక్కడ ఎంతమంది ఓటర్లు?

తెలంగాణ: 3.17 కోట్లు

రాజస్థాన్: 5.25 కోట్లు కాగా 74.13 శాతం పోలింగ్ నమోదైంది.

మధ్యప్రదేశ్: 5.8 కోట్లు కాగా 76.22 శాతం పోలింగ్ నమోదైంది.

ఛత్తీస్‌గఢ్: 2.03 కోట్లు కాగా 76.31 శాతం పోలింగ్ నమోదైంది.

మిజోరం: 8.52 లక్షలు కాగా 78.40 శాతం పోలింగ్ నమోదైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)