You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అస్సాంలో చిరుతపులి దాడి.. 13 మందికి గాయాలు
చిరుతపులి దాడిలో 13 మంది గాయపడ్డారు.
అస్సాంలోని జోర్హట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ కేంద్రం సమీపంలో చిరుతపులి కనిపించింది.
ముగ్గురు అటవీశాఖ సిబ్బందితో పాటు మొత్తం 13 మంది గాయపడ్డారని జిల్లా ఎస్పీ మోహనల్ లాల్ మీనా చెప్పారు.
గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఎస్పీ తెలిపారు.
సోమవారం ఉదయం చిరుతపులి దాడి సమాచారం రాగానే అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లారు.
చిరుతపులి తమ సిబ్బందిపై కూడా దాడి చేసిందని అధికారులు చెప్పారు.
మత్తు మందు ఇచ్చి చిరుతపులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- కరెంటు, తిండీ లేకుండా సముద్రంలోనే నెల రోజులు, చివరికి ఎలా బయటపడ్డారు?
- కోవిడ్-19 బీఎఫ్7: ఆక్సిజన్ సిలిండర్, మందులు కొని ఇంట్లో పెట్టుకోవాలా?
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- క్రికెట్: ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 భారత ఆటగాళ్లు వీళ్లే...
- చార్లీ చాప్లిన్ శవపేటికను దొంగతనం చేసి, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన దొంగల కథ మీకు తెలుసా..?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)