అస్సాంలో చిరుతపులి దాడి.. 13 మందికి గాయాలు

వీడియో క్యాప్షన్, చిరుతపులి దాడిలో 13 మందికి గాయాలు
అస్సాంలో చిరుతపులి దాడి.. 13 మందికి గాయాలు

చిరుతపులి దాడిలో 13 మంది గాయపడ్డారు.

అస్సాంలోని జోర్‌హట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ కేంద్రం సమీపంలో చిరుతపులి కనిపించింది.

ముగ్గురు అటవీశాఖ సిబ్బందితో పాటు మొత్తం 13 మంది గాయపడ్డారని జిల్లా ఎస్పీ మోహనల్ లాల్ మీనా చెప్పారు.

గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఎస్పీ తెలిపారు.

సోమవారం ఉదయం చిరుతపులి దాడి సమాచారం రాగానే అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లారు.

చిరుతపులి తమ సిబ్బందిపై కూడా దాడి చేసిందని అధికారులు చెప్పారు.

మత్తు మందు ఇచ్చి చిరుతపులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

చిరుతపులి దాడి

ఫొటో సోర్స్, ANI

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)