విజయవాడ: ధరాభారంతో మూడు పనులు చేస్తున్న మహిళ

వీడియో క్యాప్షన్, ధరాభారంతో అదనపు పని భుజాన వేసుకొంటున్న కుటుంబాలు
విజయవాడ: ధరాభారంతో మూడు పనులు చేస్తున్న మహిళ

ధరల పెరుగుదలతో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై భారం అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఆర్థిక కష్టాలను ఎదుర్కొనేందుకు ఎంతో మంది అదనపు పనిని భుజాన వేసుకొంటున్నారు. అలాంటి వారిలో విజయవాడకు చెందిన ఈ మహిళ ఒకరు.

"జీవనం చాలా కష్టంగా ఉంది. తెలియకుండానే ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, నీటి ఛార్జీలు పెరిగిపోయాయి. బియ్యం బస్తా 900 నుంచి 1350కి పెరిగింది. గ్యాస్ సిలిండర్ 600 నుంచి 1160 అయ్యింది. ఏది తగ్గించాలన్నా అవడం లేదు. పిల్లలకు సరైన పోషణ ఇవ్వకుండా ఎలా ఉంటాం" అని గర్రె పాలవల్లి అంటున్నారు.

మహిళలు

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)