You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సింహాచలం గిరి ప్రదక్షిణ, 8 ఫోటోలలో..
- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ కోసం
ఏటా ఆషాఢ మాసంలో అమావాస్య రాత్రికి ముందు వచ్చే పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ జరుగుతుంది.
ఇది సింహాచల లక్ష్మీనృసింహ స్వామివారి ప్రాచీన సంప్రదాయాలలో ఒకటి.
ఈ ఏడాది, గిరి ప్రదక్షిణ జూలై 9 (బుధవారం) సాయంత్రం నుంచి ప్రారంభమైంది.
సింహాచలం కొండ చుట్టూ మొత్తం దూరం సుమారు 32 కిలోమీటర్ల మేర భక్తులు కాలినడకన ప్రదక్షిణ చేస్తారు.
గిరి ప్రదక్షిణ కోసం వస్తున్న భక్తుల కోసం పోలీస్, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, బారికేడింగ్, డ్రోన్ కెమెరాలు, నీరు, ఫస్ట్ఏయిడ్ పాయింట్లు ఏర్పాటు చేశారు.
ప్రదక్షిణలో పాల్గొన్న భక్తుల లెక్కను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేశామని అధికారులు తెలిపారు.