నిజామాబాద్ జిల్లా బోధన్లో శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు వర్గాలకు చెందిన ఆందోళనకారులు రాళ్లు రువ్వుకోవడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
శ్రీలంక ఇంధన సంక్షోభం దిశగా సాగుతోంది. దేశంలో పెట్రోల్, కిరోసిన్ కోసం ప్రజలు పొడవాటి క్యూలలో నిలబడుతున్నారు.
ఆదివారం రెండు వేర్వేరు నగరాల్లో ఇలా క్యూలో నిలబడిన ఇద్దరు వృద్ధులు చనిపోయారని శ్రీలంక పోలీసులు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.
యుక్రెయిన్లో లక్ష్యాలపై రెండవసారి హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.
రష్యా దాడిలో యూరప్లోని అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీలలో ఒకటైన అజోవ్స్టాల్ ధ్వంసమైందని యుక్రెయిన్ అధికారులు తెలిపారు.
400 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్న ఒక పాఠశాలపై రష్యా దళాలు శనివారంబాంబు దాడి చేసినట్లు మారియుపూల్ సిటీ కౌన్సిల్ తెలిపింది.
యుక్రెయిన్, రష్యా తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీ చూడండి. ధన్యవాదాలు.












