భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడానని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ ట్వీట్ చేశారు. రష్యా దాడుల గురించి మోదీకి వివరించానని, లక్ష మందికి పైగా రష్యా సైనికులు తమ భూభాగంలో దాడి చేశారని మోదీకి చెప్పినట్లు జెలియన్‌స్కీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

లైవ్ కవరేజీ

  1. తాత్కాలికంగా దూకుడు తగ్గించిన రష్యా సేనలు – బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ

    రష్యా సేనలు తమ దూకుడును తాత్కాలికంగా తగ్గించాయని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘తీవ్రమైన వ్యూహాత్మకమైన సమస్యలు, యుక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన’ ఇందుకు కారణమని చెబుతూ రక్షణ శాఖ ట్వీట్ చేసింది.

    “రష్యా సేనలు యుక్రెయిన్‌లో ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలను దాటుకుంటూ పోతున్నాయి. వాటిని చుట్టుముట్టి ఏకాకిని చేసే ప్రయత్నంలో ఉన్నాయి” అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    ‘యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ను స్వాధీనం చేసుకోవడమే రష్యా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది’ అని కూడా ఆ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.

    ఇదిలా ఉంటే, యుక్రెయిన్ రక్షణ కోసం తమ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని, ఆయుధాలు వదిలిపెట్టమని ఆ దేశ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్క్సీ స్పష్టం చేశారు.

    యుక్రెయిన్
  2. యుక్రెయిన్ సంక్షోభం చైనాకు సవాలుగా మారిందా?

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, AFP

    రష్యా, చైనాలు కలిసి ప్రపంచంలో "తీవ్రమైన అప్రజాస్వామిక" వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని అమెరికా ఆరోపించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు యుక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రకటించడానికి కొన్ని గంటల ముందు అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది.

    ఇటీవల వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల రోజు రష్యా, చైనా "నో లిమిట్స్" ఒప్పందంపై సంతకం చేశాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఆపడానికి ప్రయత్నించవచ్చని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ కూడా అన్నారు.

    పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి:

  3. బ్రేకింగ్ న్యూస్, అపార్ట్‌మెంట్‌ భవనంపై దాడిలో ఇద్దరు మృతి

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

    కీయెవ్‌లో ఒక అపార్ట్‌మెంట్ భవనంపై క్షిపణి దాడి జరిగిందని మేం ఉదయం నుంచీ రిపోర్ట్ చేస్తున్నాం.

    ఇప్పుడు అదే విషయాన్ని ధ్రువీకరిస్తూ, ఆ దాడిలో ఇద్దరు చనిపోయారని అధికారులు చెప్పారు.

    మరో ఆరుగురు వ్యక్తులు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారని యుక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ ప్రకటించింది.

  4. రష్యా యూజర్లకు ట్విటర్‌ను బ్లాక్ చేశారు

    రష్యా దాడులకు సంబంధించిన వీడియోలు, దాడుల ఫలితంగా సంభవిస్తున్న బాధాకర పరిణామాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి దృశ్యాలెన్నో ట్విటర్లో కూడా షేర్ అవుతున్నాయి. దాంతో, అలాంటి దృశ్యాలను రష్యా యూజర్లకు అందకుండా బ్లాక్ చేసినట్లు ఇంటర్నెట్ కనెక్టివిటీ కంపెనీ నెట్‌బ్లాక్స్ బీబీసీకి చెప్పింది.

    శనివారం నాడు సోషల్ మీడియా వేదికల సేవలు చాలా వరకు అంతరాయానికి గురయ్యాయి. రష్యా అధికారులు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ యజమానుల మధ్య యుక్రెయిన్ విషయంలో నియమ నిబంధనలకు సంబంధించిన ఘర్షణలు చోటు చేసుకున్నాయి

    “రష్యా నియంత్రణ మూలంగా ఈ సంక్షోభం సమయంలో సమాచార వ్యాప్తి కచ్చితంగా పరిమితమవుతుంది. ఏం జరుగుతుందో ప్రజలు తెలుసుకోవాల్సిన సమయంలో ఇలాంటి పరిమితులు ఎదురవుతున్నాయి” అని నెట్‌బ్లాక్స్ డైరెక్టర్ ఆల్ప్ టోకర్ అన్నారు.

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, జర్మనీ: బెర్లిన్‌లోని బ్రాండన్‌బర్గ్ గేటు వద్ద రష్యా దాడులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు
  5. రష్యా సేనలతో నిండిన విమానాన్ని కూల్చేశామన్న యుక్రెయిన్

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

    కీయెవ్ సమీపంలో రష్యా సైనికులతో వస్తున్న విమానాన్ని తాము కూల్చేశామని యుక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి అన్నారు. ఆ విమానంలో భారీ సంఖ్యలో రష్యన్ పారాట్రూపర్లు ఉన్నారని ఆయన తెలిపారు.

    ఈ విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా నిర్ధరించలేదు. రష్యా రక్షణ మంత్రి కూడా ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు.

    యుక్రెయిన్ రక్షణ మంత్రి ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ ద్వారా తమ దేశానికి చెందిన ఎస్.యు-27 ఫైటర్ జెట్లు, రష్యా దళాలతో వస్తున్న ఐఎల్-76 విమానాన్ని కూల్చేశాయని పేర్కొన్నారు. ఆ విమానం కీయెవ్ ప్రాంతంలో పారాట్రూపర్లను దించడానికి వచ్చిందని కూడా అందులో రాశారు.

    ఆ విమాన తయారీదారు అందించిన సమాచారం ప్రకారం అందులో 167 మంది సైనికులు ప్రయాణించే వీలుంది. వీరితో పాటు 6-7 మంది సిబ్బంది కూడా అందులో ప్రయాణించవచ్చు.

    ఎనిమిదేళ్ల కిందట యుక్రెయిన్‌కు చెందిన 40 పారాట్రూపర్లు, తొమ్మిది మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానాన్ని రష్యా కూల్చిందని, దానికి ఇది ప్రతీకారమని యుక్రెయిన్ మిలటరీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వేలరీ జులుజ్‌నీ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ రాశారు.

    కాగా, శనివారం నాడు తమ సైన్యంలో ఎవరూ చనిపోలేదని రష్యా సైన్యం ప్రతినిధి మేజర్ జనరల్ ఐకగోర్ కోనాషెంకోవ్ చెప్పారు.

  6. భారత ప్రధానితో మాట్లాడిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ

    భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడానని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ ట్వీట్ చేశారు.

    రష్యా చేస్తున్న దాడుల గురించి మోదీకి వివరించానని జెలియన్‌స్కీ చెప్పారు. లక్ష మందికి పైగా సైనికులు తమ భూభాగంలో దాడి చేశారని, విచక్షణారహితంగా కాల్పులు జరిపారని మోదీకి చెప్పినట్లు జెలియన్‌స్కీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    భద్రతా మండలిలో భారతదేశం తమకు మద్దతు ఇవ్వాలని, రెండు దేశాలు కలసికట్టుగా ఆక్రమణదారులను ఎదుర్కోవాలని ఆయన చెప్పుకొచ్చారు.

    యుక్రెయిన్ మీద రష్యా దాడులు మొదలైన తరువాత గురువారం నాడు భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. యుక్రెయిన్‌లో హింసను సత్వరమే ఆపేయాలని మోదీ రష్యా అధ్యక్షుడిని కోరారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. కీయవ్ నగరంలోని అపార్ట్‌మెంట్‌ను ఓ క్షిపణి ఢీకొట్టిన క్షణం

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లోని అపార్ట్‌మెంట్‌ భవనంపై క్షిపణి దాడి జరిగిందని ఈ ఉదయం నుంచి మేం రిపోర్ట్ చేస్తూ వచ్చాం. ఈ సీసీటీవీ చిత్రం ఆ దాడి ఎలా జరిగిందో చూపిస్తోంది.

    ఈ దాడిలో ఎంతమంది చనిపోయారన్న సమాచారం మాకు తెలియలేదు. కానీ, రాత్రి జరిగిన ఈ దాడిలో దాదాపు 35 మంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు.

  8. ‘నన్ను పట్టుకోవాలన్న రష్యా పన్నాగం విఫలమైంది’– జెలియెన్‌స్కీ

    గత రాత్రి తనను నిర్బంధించి తమ మనిషిని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టాలని రష్యా వేసిన పథకాన్ని తమ దేశ సైనిక దళాలు విఫలం చేశాయని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ ఒక వీడియో సందేశంలో తెలిపారు.

    ఈ దాడిని నిలువరించాలని రష్యా ప్రజలు కూడా తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మీద ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.

    “వాళ్ల పథకాన్ని మేం విఫలం చేశాం” అని జెలియెన్‌స్కీ అన్నారు.

    కీయెవ్ నగరంతో పాటు ఇతర ప్రధాన నగరాలన్నీ యుక్రెయిన్ దళాల నియంత్రణలోనే ఉన్నాయని ఆయన అన్నారు.

    యూరోపియన్ యూనియన్‌లో సభ్యదేశంగా ఉండే హక్కు తమకుందని ఆయన చెప్పారు.

    యుక్రెయిన్ ప్రస్తుతం ఈయూ సభ్య దేశం కాదు. కానీ, అది ఈయూలో చేరాలనే తన ఆకాంక్షను రాజ్యాంగబద్ధంగా వ్యక్తం చేసింది.

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

  9. పాశ్చాత్య దేశాలతో మాకు దౌత్య సంబంధాలు అవసరం లేదు: రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్

    మెద్వదేవ్

    ఫొటో సోర్స్, Getty Images

    పాశ్చాత్య దేశాలతో తమకు దౌత్య సంబంధాలు అవసరంలేదని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ అన్నారు.

    రష్యాపై పాశ్యాత్య దేశాల ఆంక్షల వెల్లువ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    2020లో మెద్వదేవ్‌ను ప్రధాన మంత్రి పదవి నుంచి పుతిన్ తొలగించారు. ప్రస్తుతం మెద్వదేవ్ మాస్కో భద్రతా మండలి అధ్యక్షుడిగా ఉన్నారు.

    తాజాగా మెద్వదేవ్ రష్యా సోషల్ మీడియా వీకేలో పాశ్చాత్య దేశాలను ఉద్దేశించి ‘‘మీ రాయబార కార్యాలయాలకు తాళాలు వేసుకోండి’’ అని పోస్ట్ చేశారు.

    పుతిన్ నిర్దేశించిన లక్ష్యాలు చేరుకునేవరకు యుక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతుందని ఆయన అన్నారు.

    అయితే, పుతిన్ నిర్దేశించిన లక్ష్యాలు ఏమిటనేది మాత్రం ఆయన వెల్లడించలేదు.

  10. బ్రేకింగ్ న్యూస్, రష్యా దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా 198 మంది మృతి

    యుక్రెయిన్ ఆసుపత్రులలో బాధితులు

    ఫొటో సోర్స్, facebook/ViktorLiashko

    రష్యా దాడుల్లో ఇప్పటివరకు 198 మంది యుక్రెయినియన్లు చనిపోయారని యుక్రెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి విక్టర్ ల్యాష్కో తెలిపారు.

    మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు ల్యాష్కో చెప్పారు.

    మొత్తం 1,115 మంది గాయపడ్డారని.. గాయపడినవారిలో 33 మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు.

    గత మూడు రోజులుగా వైద్యులు ఇళ్లకు కూడా వెళ్లకుండా క్షతగాత్రులకు సేవలందిస్తున్నారని చెప్పారు.

  11. ఆయుధాలు వదిలిపెట్టబోం: వొలదిమీర్ జెలియెన్క్సీ

    యుక్రెయిన్ రక్షణ కోసం తమ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని.. ఆయుధాలు వదిలిపెట్టబోమని ఆ దేశ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్క్సీ స్పష్టం చేశారు.

    ఆయుధాలు వదిలి రష్యాకు లొంగిపోవాలని తాను సైన్యానికి సూచించినట్లు వస్తున్న వదంతులను తోసిపుచ్చుతూ ఆయన ట్విటర్ వేదికగా విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో ఈ మేరకు స్పష్టం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. యుక్రెయిన్‌‌లో చిక్కుకున్న 219 మంది భారతీయులతో ముంబయి వస్తున్న తొలి విమానం

    యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులలో చాలామంది రొమేనియా చేరుకోగా అక్కడి నుంచి 219 మందితో తొలి విమానం ముంబయి బయలుదేరింది.

    ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ట్విటర్‌లో వెల్లడించారు.

    యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

    భారతీయులను తరలించడంతో సహకారం అందిస్తున్న రొమేనియాకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. కీయెవ్‌లో పెద్దసంఖ్యలో క్షతగాత్రులు

    కీయెవ్‌లో ధ్వంసమైన భవనాలు

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో రాత్రి కొనసాగిన యుద్ధంలో 35 మంది గాయపడ్డారని ఆ నగర మేయర్ తెలిపారు.

    గాయపడినవారిలో ఇద్దరు చిన్నారులూ ఉన్నట్లు మేయర్ చెప్పారు.

    అయితే, గాయపడినవారిలో సాధారణ పౌరులు ఎంతమంది? సైనికులు ఎంతమంది అనేది ఆయన వివరాలు వెల్లడించలేదు.

    కీయెవ్‌లో ప్రస్తుతం రష్యా సేనలు భారీ సంఖ్యలో లేవని చెప్పారు.

  14. నాటోలో చేరడానికి భారత్‌‌కు ఉన్న అభ్యంతరాలేమిటి

    వైమానిక దాడులు

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) పేరు వార్తల్లో మార్మోగుతోంది. అమెరికా నేతృత్వంలోని నాటోలో యుక్రెయిన్ చేరకూడదని రష్యా పట్టుబడుతోంది.

    అంతేకాదు1997 తర్వాత నాటోలో చేరిన తూర్పు యూరప్ దేశాల నుంచి నాటో తమ బలగాలను ఉపసంహరించుకోవాలని రష్యా డిమాండ్ చేస్తుంది.

    ఈ నేపథ్యంలో భారత్‌తో నాటో సంబంధాలపైనా చర్చ జరుగుతోంది.

    భారత్ ఎందుకు నాటోలో చేరలేదు? చేరితే వచ్చే ప్రయోజనాలు ఏమిటి? ప్రతికూల ప్రభావాలేమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో..

  15. కీయెవ్ అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

    బేబీ

    ఫొటో సోర్స్, Kievmap on Telegram

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌పై రష్యా వైమానిక దాడుల నేపథ్యంలో ప్రజలు అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు.

    కీయెవ్‌లో రైల్వే స్టేషన్లు తెరిచే ఉంచారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై ప్రజలు తలదాచుకుంటున్నారు. బయటి ప్రపంచంతో మాట్లాడేందుకు వాళ్లు టెలిగ్రామ్ యాప్‌ను ఉపయోగించుకుంటున్నారు.

    ఒక మహిళ కీయెవ్‌లోని మెట్రో స్టేషన్‌లో కొన్ని గంటల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చిందని టెలిగ్రామ్‌లోని ఒక ఓపెన్ గ్రూప్ వెల్లడించింది.

  16. ఫ్రాన్స్ నుంచి ఆయుధాలు వస్తున్నాయి - యుక్రెయిన్‌ అధ్యక్షుడు

    ఫ్రాన్స్ నుంచి ఆయుధాలు, ఇతర సామాగ్రి యుక్రెయిన్‌కు వస్తున్నాయని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు.

    ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో మాట్లాడినట్లు ఆయన చెప్పారు.

    ‘యుద్ధ వ్యతిరేక కూటమి పని చేస్తోంది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    అలాగే, యురోపియన్‌ యూనియన్‌లో యుక్రెయిన్ చేరికపై ఈయూ అధ్యక్షుడితో కూడా చర్చలు జరిపానని జెలెన్‌స్కీ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  17. యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో రష్యా, యుక్రెయిన్ సైన్యాల భీకర పోరు

    వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో రష్యా, యుక్రెయిన్ సైన్యాల భీకర పోరు
  18. రాజధాని కీయెవ్‌పై క్షిపణి దాడులు

    కీయెవ్‌లోని నైరుతి ప్రాంతాన్ని ఇవాళ ఉదయం రెండు క్షిపణులు ఢీకొట్టాయని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. అయితే, వేటిని లక్ష్యం చేసుకుని ఈ క్షిపణులు ప్రయోగించారన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

    కీయెవ్‌ సిటీ ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం ఒక క్షిపణి రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌ను ఢీకొట్టింది.

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

    మరొక మిసైల్ రాజధానిలోని జులియానీ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంగా పడిందని రాయిటర్స్ పేర్కొంది.

    క్షిపణి దాడిలో ధ్వంసమైన అపార్ట్‌మెంట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది.

  19. రష్యాలోని పలు నగరాల్లో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు

    రష్యాలోని పలు నగరాల్లో వేలాది మంది రష్యన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి యుక్రెయిన్‌పై రష్యా దాడిపై నిరసన వ్యక్తం చేశారు.

    యుద్ధ వ్యతిరేక నిరసనలు

    ఫొటో సోర్స్, Getty Images

    ‘యుద్ధం వద్దు’ అంటూ రష్యాలోని రెండు అతిపెద్ద నగరాలైన మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కొందరు ప్రజలు ప్లకార్డులు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు.

    యుద్ధ వ్యతిరేక ప్రదర్శన

    ఫొటో సోర్స్, Getty Images

    సైబీరియాలోని పలు నగరాల్లో కూడా ప్రజలు తమ నిరసన గళం వినిపించారు.

    మాస్కో

    ఫొటో సోర్స్, Getty Images

    అయితే, ఆందోళన చేస్తున్న వారిని రష్యన్ పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 1800 మందిని అదుపులోకి తీసుకున్నారు.

    మాస్కో

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యా, యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

  20. మరో వీడియో విడుదల చేసిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

    ‘నేను ఇక్కడే ఉన్నాను. మేము ఆయుధాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా దేశాన్ని మేము రక్షించుకుంటాం’ అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పినట్టు కీయెవ్ ఇండిపెండెంట్‌ పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఆయుధాలు వదిలిపెట్టాలని తాను చెప్పినట్లు ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం ఉందని, లొంగిపోవాలని సైనికులకు తాను చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు.