మొహంజోదారోకు తప్పిన వరద ముప్పు... వేల ఏళ్ళ నాటి డ్రైనేజి నిర్మాణాలే కాపాడాయంటున్న నిపుణులు
ప్రాచీన నాగరికతకు నిదర్శనంగా నిలిచిన మొహంజోదారో కట్టడానికి వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరిస్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఆ ప్రదేశాన్ని పర్యవేక్షించారు.
ఇటీవల మొహంజోదారోలో భారీ వర్షపాతం నమోదైంది. దాదాపు 4,500 ఏళ్ల కింద నిర్మించిన ఈ పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ పని చేస్తోందని, వర్షపు నీరంతా ఆ కాల్వల ద్వారానే బయటకు వెళ్లిందని అధికారులంటున్నారు.
"వర్షపు నీటిని బయటకు పంపేందుకు మేం చేసిన ప్రయత్నం ఏమీ లేదు. మా సిబ్బంది చేసిందల్లా... ఇక్కడి డ్రైనేజీల్లోంచి బయటకు వెళ్లాక, ఒకచోట చేరిన నీటినంతా ఖాళీ చేసేందుకు మెషీన్లు ఏర్పాటు చేయడమే" అని పాకిస్తాన్ సాంస్కృతికి శాఖ యాంటిక్విటిస్ డైరెక్టర్ మంజూర్ అహ్మద్ చెప్పారు.
అయితే, దీనికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి మరమ్మతు పనులు అవసరం అని చెబుతున్నారు.
బీబీసీ ప్రతినిధి సహేర్ బలోచ్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గ్రామంలో మగవాళ్లు ఎక్కువగా చనిపోతున్నారు. ఎందుకు? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది?
- సింగిల్ షేమింగ్: ఒంటరిగా జీవించే వ్యక్తులను ఎందుకు జడ్జ్ చేస్తుంటారు? ఒంటరిగా బతికితే తప్పా?
- బెంగళూరు వరదలు: సంపన్నులకు కూడా తప్పని కష్టాలు... ఇళ్లను ముంచెత్తిన వరదనీటితో ఇబ్బందులు
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- మీరు డార్క్ చాక్లెట్ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)