మియన్మార్‌లో ప్రజల్ని చంపి, మహిళల్ని రేప్ చేసి, గ్రామాలను తగలబెట్టిన సైన్యం

వీడియో క్యాప్షన్, మియన్మార్‌లో సైన్యం ఆదేశాలతోనే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని కొందరు సైనికులు అంగీకరించారు.

మియన్మార్‌లో సైన్యం ఆదేశాలతోనే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని.. ఇటీవల దేశం విడిచి పారిపోయిన ఆరుగురు సైనికులు అంగీకరించారు.

పౌరుల హత్యలు, అత్యాచారాలు, గ్రామాలను తగలబెట్టడం లాంటి ఘటనల గురించి బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

అంగ్‌సాన్ సూచీ నాయకత్వంలో ఎన్నికైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారాన్ని చేపట్టిన సైన్యం.. తమకు వ్యతిరేకంగా నడుస్తున్న సాయుధ ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది.

బీబీసీ ప్రతినిధి రెబెక్కా హెన్ష్‌కే అందిస్తోన్న ఈ కథనంలో కలచివేసే దృశ్యాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)